Money: కరోనా పుణ్యమాని ఆన్లైన్ మోసాలు ఇటీవలికాలంలో విపరీతంగా పెరిగిపోతున్నాయి. వర్క్ ఫ్రమ్ హోమ్, డిజిటల్ లావాదేవాలు లాంటి పలు కారణాల వలన దాదాపుగా అందరూ స్మార్ట్ఫోన్, ల్యాప్టాప్స్ అధికంగా వాడుతున్నారు. ఇదే సైబర్ నేరగాళ్ల పాలిట వరంగా మారుతుంది. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా వుంది. లేదంటే కస్టపడి సంపాదించిన సొమ్ముని పోగొట్టుకోవాల్సి వస్తుంది. మోసగాళ్లు ఫేక్ స్కీమ్స్తో ప్రజలను ఆకర్షించడానికి ప్రయత్నించే అవకాశం ఉంటుంది.
Life Risk: మగవారు ఈ తప్పులు చేయడం వలనే వారి లైఫ్ రిస్క్ లో పడుతుంది..!!
Money: పోంజి స్కీమ్స్ అని వీటిని అంటారు?
ఫేక్ స్కీమ్స్నే పోంజి స్కీమ్స్ అని కూడా పిలుస్తారు. ఇలాంటి పథకాల్లో చేరితే అధిక రాబడి వస్తుందని వారు నమ్మబలుకుతారు. దాంతో వారి మాటలకు మనం టెంప్ట్ అవుతాం. ఇక నమ్మి డబ్బులు పెడితే మాత్రం.. ఇక ఆ డబ్బుల గురించి పూర్తిగా మర్చిపోవాల్సిందే. మళ్లీ వెనక్కి వచ్చే ప్రసక్తే లేదు. మీ అకౌంట్ పూర్తిగా ఖాళీ అయిపోతుంది. అందుకే మీరు పోంజి స్కీమ్స్తో జాగ్రత్తగా ఉండాలి. స్వల్ప కాలంలో భారీ లాభం వస్తుందని ఎవరైనా చెబితే మాత్రం అస్సలు నమ్మవద్దు. పూర్తి వివరాలు తెలుసుకోవాలి.
YS Jagan: జగన్ తో డీలింగంటే ఇంతే మరి.. ఉద్యోగులకు స్ట్రాంగ్ షాక్ ఇది..!
ఇలా చేస్తే సేఫ్.!
ఇలాంటి వాటికి చెక్ పెట్టాలంటే ఇలా చేయండి! డబ్బులు పెట్టడానికి ముందే ఇన్వెస్ట్మెంట్ సంబంధిత సమాచారం మొత్తం నిశితంగా పరిశీలించాలి. ఇన్వెస్ట్మెంట్ ప్రమోటర్ను కలిసి, వారి బ్యాక్గ్రౌండ్ క్షుణ్ణంగా చెక్ చేయండి. వారికి సర్వీసులు అందించడానికి లైసెన్స్ ఉందో లేదో తెలుసుకోండి. అలాగే స్థానికంగా ఉంటే నియంత్రణ సంస్థలను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోండి. ఇకవేళ మీరు ఇప్పటికే డబ్బులు పెట్టి రాబడి పొంది ఉంటే.. మళ్లీ ఆ రాబడిని తిరిగి ఇన్వెస్ట్ చేయాలని ఒత్తిడి తీసుకువస్తే.. మీరు అధికారులకు ఈ విషయాన్ని తెలియజేయండి.