మాస్ మహారాజ రవితేజ – గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో హ్యాట్రిక్ సినిమాగా క్రాక్ రూపొందుతోంది. ఇప్పటికే ఈ ఇద్దరి కాంబినేషన్ లో డాన్ శీను, బలుపు లాంటి సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. అందుకే ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. కాగా దాదాపు మూడేళ్ళ తర్వాత ఈ సినిమాతో శృతి హాసన్ హీరోయిన్ గా మళ్ళీ ఎంట్రీ ఇస్తోంది. గత రెండు మూడేళ్ళగా గ్యాప్ తీసుకున్న శృతిహాసన్ మళ్ళీ వరసగా తెలుగుతో పాటు తమిళ సినిమాలు ఒప్పుకుంటోంది. తెలుగులో నటిస్తున్న క్రాక్ పూర్తయింది. ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ చేయబోతున్నారు.
ప్రస్తుతం సినిమా నుంచి రిలీజైన స్పెషల్ సాంగ్ మాస్ ఆడియన్స్ ని ఊపేస్తోంది. ఈ సినిమా సక్సస్ మీద రవిత్ ఏజ, దర్శకుడు గోపీచంద్ మలినేని చాలా నమ్మకాలు పెట్టుకున్నారు. వీరితో పాటు హీరోయిన్ శృతి హాసన్ కూడా ఈ సినిమా సక్సస్ మీద చాలా నమ్మకంగా ఉంది. ఇక ఈ సినిమాతో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి వకీల్ సాబ్ లోనూ నటించబోతోంది. డిసెంబర్ ఫస్ట్ వీక్ నుంచి శృతి హాసన్ వకీల్ సాబ్ సెట్ లో జాయిన్ కాబోతున్నట్టు సమాచారం. గెస్ట్ రోల్ అయినా సినిమా కీ శృతిహాసన్ పాత్ర చాలా కీలకమని అంటున్నారు.
ఈ రెండు సినిమాలతో పాటు కోలీవుడ్ లో విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘లాభం’ అనే సినిమా కూడా చేస్తోంది. ఎస్పీ జననాథన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాని విజయ్ సేతుపతి సొంతంగా నిర్మిస్తున్నాడు. అయితే గత రెండు మూడేళ్ళగా సినిమాలకి బ్రేక్ ఇచ్చిందని సోషల్ మీడియాలో రక రకాల కామెంట్స్ వచ్చాయి. వాటన్నికి సాలీడ్ గా సమాచానం చెప్పింది శృతి హాసన్. మల్టీ టాలెంటెడ్ అయిన శృతిహాసన్ సింగర్, మోడల్, రచన, పెయింటింగ్, సంగీతం.. ఇలా పలు విభాగాలలో బిజీగా ఉంటుంది. అయితే ఒక్కో సమయంలో ఒక్కో విభాగానికి బ్రేక్ తీసుకుంటుందట. ఆ రకంగా రెండేళ్ళు సినిమాలకి బ్రేక్ ఇచ్చినట్టు క్లారిటీ ఇచ్చింది.
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!