తెలుగు చిత్ర పరిశ్రమలో కమెడియన్స్ హీరోలుగా మారుతున్న సంగతి తెలిసిందే. హీరోగా మారి ఎంత వరకు సక్సస్ అవుతున్నారు అన్నది పక్కన పెడితే హీరో అన్న పదం మాత్రం పేరు పక్కన చేతుంది. కాని ఒక కమెడియన్ హీరోగా మారి స్టార్ అయింది మాత్రం చాలా తక్కువ మంది. ఈ క్రమంలో మరో కమెడియన్ హీరోగా మారబోతున్నాడు. ప్రస్తుతం టాలీవుడ్ లో తన మార్క్ కామెడీతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న కమెడియన్ సత్య ఇప్పుడు హీరోగా నటిస్తున్నాడు.
యంగ్ హీరో సందీప్ కిషన్ తన హోమ్ బ్యానర్ లో నిర్మించే సినిమాలో సత్యను హీరోగా తీసుకుంటున్నాడని సమాచారం. ఇటీవల ‘వివాహ భోజనంబు’ అనే టైటిల్ తో హీరో ఫేస్ కనిపించకుండా ఓ పోస్టర్ రిలీజ్ చేసాడు సందీప్ కిషన్. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ఈ సినిమాలో హీరో సత్య అని తెలుస్తోంది. ఇప్పటి వరకు బ్రహ్మానందం – అలీ – వేణు మాధవ్ – సునీల్ – శ్రీనివాస్ రెడ్డి – షకలక శంకర్ – సప్తగిరి లాంటి స్టార్ కమెడియన్స్ హీరోలుగా మారి పలు చిత్రాల్లో నటించారు. రీసెంట్ గా సుహాస్ కూడా ‘కలర్ ఫోటో’ సినిమాతో హీరోగా మారిన సంగతి తెలిసిందే. ఈ కమెడియన్స్ లో చాలామంది హీరోలుగా సినిమాలు చేస్తూనే కమెడియన్ గా కూడా మంచి పాత్రలు పోషిస్తున్నారు.
ఇక ఈ మద్య సునీల్ జోరు తగ్గడంతో మళ్ళీ అరవింద సమేత, అల వైకుంఠపురములో లాంటి సినిమాలలో కామెడీ పాత్రలు పోసితున్నాడు. ఇకపై కూడా కమెడియన్ గా పాత్రలు చేయడానికి సిద్దంగా ఉన్నాడు సునీల్. ఇక ఈ కమెడియన్స్ అందరూ కామెడీ జోనర్ లో సినిమా చేస్తేనే చూస్తున్నారు తప్ప హీరో అంటూ యాక్షన్ సినిమాలు చేస్తే ఎవరూ పట్టించుకోవడం లేదు. అలా కెరీర్ దెబ్బై పోయిన వాళ్ళు ఉన్నారు.
ఈ నేపథ్యంలో ఇప్పుడు హాస్యనటుడు సత్య కూడా హీరోయిజం సినిమాలు కాకుండా కామెడీ నేపథ్యంలో ఉండే సినిమాల్లో నటిస్తే ప్రేక్షకులు ఆదరించే అవకాశం ఉంది. అందులోనూ అలీ – శ్రీనివాస్ రెడ్డి మాదిరిగా కమెడియన్స్ గా కొనసాగుతూనే అప్పుడప్పుడు హీరోలుగా నటిస్తే కెరీర్ పరంగా బాగుంటుందని కొందరు సలహాలిస్తున్నారు. మరి సత్య హీరోగా ఎంతవరకు సక్సస్ అవుతాడో చూడాలి.