ఫంక్షన్ లు జరిగినా..నలుగురు ఒక చోట చేరినా.. ఆఫీస్, రెస్టారెంట్ ఇలా.. ప్రతి ఒక్కరూ తమ హుందా తనాన్ని వ్యక్త పరచడానికి ఆసక్తి చూపిస్తుంటారు. అది డ్రస్సింగ్ కావచ్చు. వారి మాట తీరు కావచ్చు. ఆభరణాలు అయి ఉండవచ్చు. ముఖ్యంగా వారు కూర్చునే విధానమే వారి హుందా తనాన్ని వ్యక్తపరుస్తుంది.
పదిమంది ఒక ప్రదేశంలో కూర్చుని ఉన్నప్పుడు స్టైలిష్ గా కూర్చుంటారు. అదే నండి కాలు మీద కాలు వేసుకొని [ క్రాస్ లెగ్] హుందాగా కూర్చోవడం. ఎక్కువగా మహిళలు ఈ భంగిమలో కూర్చోని తమ హుందా తనాన్ని తెలియజేస్తారు. మగవారు కూడా కూర్చుంటారు అనుకోండి. కాని మహిళలే ఎక్కువగా ఈ భంగిమను అనుసరిస్తారు. సాధారణంగా వారికి తెలియకుండానే ఈ భంగిమలో కూర్చోవడం అలవాటుగా మారుతుంది. ఈ భంగిమలో కూర్చోవడం వలన కలిగే మంచి చేడులు గురించి, లాభ నష్టాలు గురించి ఎవరు అలోచించరు. ఈ రకంగా కూర్చోవడం వలన కాల క్రమేణ రక్తపోటు పెంచడానికి కారణం కావచ్చు అనేది వైద్యులు చెపుతున్నారు. అలానే కొన్ని అధ్యాయనాల్లో రక్తపోటు పెరుగుతుందని తేలింది. గర్బిణి స్త్రీలు ఈ భంగిమలో కూర్చోవడం అంత మంచిది కాదనేది వైద్యుల సూచన.
కాలు మీద కాలు వేసి ఎక్కువ సమయం కూర్చోవడం వలన నరాలు ఒత్తిడికి గురై దెబ్బతింటాయి. ఫలితంగా నరాల పక్షవాతం సోకే ప్రమాదం ఉంటుంది. అలానే నరాలపై ఒత్తిడి పెరిగి రక్తపోటు పెరుగుతుంది. ఇదే విషయాన్ని వైద్య పరిశోధకులు తమ అధ్యాయనాల్లో తెలిందని పేర్కొన్నారు. కాళ్ళ వరకు రక్త ప్రసరణ సాఫీగా సాగక కాళ్ళు మంటలు అనిపిస్తాయి. మరి కొందరిలో మోకాళ్ల నొప్పులు కూడా ఉత్పన్నమవుతాయి. ఇన్ని సమస్యలకు కారణం అవుతున్న ఈ భంగిమలో కూర్చోకుండా ఉండటం మేలు కదా…లేదా ఎక్కువ సేపు ఒకే భంగిమలో కూర్చో కూడదు. మధ్య మధ్యలో కదులుతూ తమ సిట్టింగ్ పోజిషన్లను మారుస్తూ ఉండాలి. ఆ విధంగా చేయండం వలన ఆరోగ్యంపై పెద్దగా ప్రభావం పడదు అని నిపుణులు సూచిస్తున్నారు.