ఉంటాయో.. ఊడుతాయో తెలియని ఉద్యోగాలతో విసుగెత్తి పోయారా ..? లేక లాక్ డౌన్ నుంచి ఉరుకులు పరుగుల జీవితం వద్దు.. ఏదైనా ప్రాఫిట్ ఉండే పని చేయాలనుకుంటున్నారా ..? కారణం ఏదైనా బిజినెస్ చేయాలనే ఉద్దేశం ఉంటే మాత్రం ఈ వార్త మీ కోసమే. బిజినెస్ అంటున్నారు.. మళ్ళీ లక్ష రూపాయలే అంటున్నారు. ఎదోమోసం ఉందని అనుకోవద్దు. మొత్తం చదివాక మీకే తెలుస్తుంది. అవును లక్ష రూపాయలు ఖర్చు చేసి మంచి లాభాలు పొందే బిజినెస్ ట్రిక్ ఇది.
తక్కువ ఇన్వెస్ట్మెంట్ తో ఈ వ్యాపారం ప్రారంభించొచ్చు. ఎక్కువ ప్రాఫిట్స్ పొందొచ్చు. అది ఏంటని హైరానా పడకండి..అది బిస్కెట్ల తయారీ వ్యాపారం. ఇందులో నష్టపోతామనే భయం కూడా అవసరం లేదు. ఎందుకంటే బిస్కెట్లకు ఉన్న డిమాండ్ మనకు తెలిసిందే. వీటిని తినేవారు రోజురోజుకీ పెరగడమే కానీ తగ్గడం ఉండదు కదా.. అందుకే ఇందులో మీరు భయం లేకుండా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఈజీగా లాభాలను పొందొచ్చు.
ఈ వ్యాపారానికి కేంద్ర ప్రభుత్వం అందించే ముద్రా స్కీమ్ కింద బ్యాంకుల నుంచి ముద్రా లోన్ కూడా తీసుకోవచ్చు. ఆ డబ్బును మీ బిస్కెట్ల వ్యాపారానికి వాడుకోవచ్చు. బిస్కెట్ తయారీ ప్లాంటు ఏర్పాటు చేయడానికి రూ.5 లక్షల వరకు ఖర్చవుతుంది. ముందుగా ఫిక్స్డ్ క్యాపిటల్ కింద మెషీన్లను కొనుగోలు చేయడానికి రూ.3.5 లక్షలు అవసరం. ముడి పదార్థాలు, వర్కర్ల జీతాలు, ప్యాకేజింగ్ మొదలగు వాటికి రూ.1.86 లక్షలు అవసరమవుతాయి. ఇందులో 90% మొత్తాన్ని బ్యాంక్ నుంచి లోన్ గా వర్కింగ్ క్యాపిటల్ కింద పొందొచ్చు. ఇక మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాల్సింది కేవలం రూ.లక్ష మాత్రమే.
ఈ బిస్కెట్లు బిజినెస్ చేయడానికి సంవత్సరానికి రూ.14.26 లక్షల తయారీ ఖర్చు ఉంటుంది. కానీ టర్నోవర్ రూ.20 లక్షలకు పైనే వస్తుంది. స్థూల ఆదాయం రూ.6 లక్షల కంటే ఎక్కువే రావచ్చు. ఇందులో నుంచి లోన్ వడ్డీ రూ.50 వేలు, ఇన్కమ్ ట్యాక్స్ రూ.15,000, ఇతర చిన్నా చితక ఖర్చుల కింద రూ.75 వేల తీసేస్తే నికరంగా రూ.4.6 లక్షల వరకు మిగులుతాయి. అంటే మీరు అటూ ఇటుగా నెలకు రూ.40 వేల ఆదాయం సంపాదించొచ్చు అనమాట. కానీ ఒక్కటి మాత్రం నిజం ఏ వ్యాపారం చేసిన ఒడిదుడుకులు తప్పనిసరి. వాటిని ఎదురుకుని ముందుకు సాగితే మాత్రం విజయం మీ పాదాల చెంతకు చేరుతుంది అనడంలో సందేహం లేదు.. ఈ మాటను చాలా మంది నిరూపించారు కూడా..