IIT Goa: సాధారణంగా ఏ తరగతి పరీక్షలు నిర్వహించిన క్వశ్చన్ పేపర్ ఆన్సర్ లు రాయమంటారు.. ఇది ఎప్పటి నుంచో వస్తున్న పరీక్ష విధానం అయితే.. ఐఐటి గోవా వాళ్ళు మేం ట్రెండ్ ఫాలో అవ్వం.. ట్రెండ్ సృష్టిస్తాం.. అనేలా క్వశ్చన్ లు మీరే తయారు చేసుకొని వాటికి సమాధానాలు కూడా మీరే రాయండి..!! అంటూ ఇచ్చిన క్వశ్చన్ పేపర్ చూసి విద్యార్థులంతా నోరెళ్లబెట్టారు..!? ఈ క్వశ్చన్ పేపర్ ను ఎవరో స్క్రీన్ షాట్ తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.. దీంతో ఈ న్యూస్ వైరల్ అవుతోంది..!!
ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గోవా (ఐఐటి గోవా) అనలాగ్ సర్క్యూట్స్ ఎగ్జామ్ లో ఈ సంఘటన చోటు చేసుకుంది సెమిస్టర్ లో విద్యార్థులు నేర్చుకున్న దానిని బట్టి ఈ పరీక్షలో సొంతంగా ప్రశ్నలు తయారు చేసి, దానికి జవాబు ఇవ్వాలని ఐఐటి విద్యార్థులకు సూచించింది. ఇది చూసిన విద్యార్థులు మొదట షాక్ అయిన తరువాత తేరుకొని తమకు తెలిసినా, నేర్చుకున్నది రాసి ఎగ్జామ్ పూర్తి చేశారు. ఈ సెమిస్టర్ లో విద్యార్థులు ఏం నేర్చుకున్నారో, 60 మార్కులకు ప్రశ్నలు రూపొందించి.. రెండు గంటలలో వాటికి సమాధానాలు కూడా రాయండి అని పేపర్లో రాసి ఉంది. కరోనా కారణంగా బోర్డు పరీక్షలు రద్దు చేయాలని దేశం మొత్తం డిమాండ్ చేస్తుంది. అయితే ఐఐటి గోవా క్వశ్చన్ పేపర్ సరికొత్త విధానానికి తెరలేపింది. వారు ఎంత వరకు నేర్చుకున్నారన్న విషయాన్ని వారికే వదిలేశారు. ఈ విధానం విద్యార్థుల భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడుతుందని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.