గోపిచంద్ మలినేని, మాస్ మహారాజా రవితేజ కాంబినేషన్ లో తెరకెక్కిన తాజా చిత్రం ‘క్రాక్’. శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్, సముద్ర ఖనీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఒంగోలులో జరిగిన ఒక యదార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించాడు గోపిచంద్ మలినేని. ఈ సినిమా రిలీజ్ కి సిద్దంగా ఉందని అంటున్నారు. ఇటీవల ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ కానుందని ప్రచారం జరగగా దర్శకుడు గోపిచంద్ మలినేని క్లారిటీ ఇస్తూ ఈ సినిమా థియోటర్స్ లోనే రిలీజ్ అవుతుందని వెల్లడించాడు.
ఈ సినిమా తర్వాత రైడ్, రాక్షసుడు ఫేం రమేష్ వర్మ దర్శకత్వంలో నటించబోతున్నాడు రవితేజ. ఈ సినిమాలో రవితేజ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నాడని తెలుస్తుంది. హీరోయిన్స్ గా నిధీ అగర్వాల్, రాశి ఖన్నాను ఎంచుకున్నట్టు సమాచారం. అలాగే నేను లోకల్ ఫేం త్రినాథ రావు నక్కిన దర్శకత్వంలో రవితేజ ఒక సినిమా చేస్తున్నాడు. కంప్లీట్ మాస్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాని దిల్ రాజు నిర్మిస్తాడని అంటున్నారు.
అయితే మరో సినిమాకి రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తాజా సమాచారం. తమిళంలో అరవింద స్వామి, త్రిష కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ‘శతురంగ వెట్టై 2’. ఈ సినిమాని తెలుగులో మాస్ మహారాజా చేయనున్నాడట. అంతేకాదు ఈ సినిమాలో ఇలియానా హీరోయిన్ గా నటించబోతుందమి సమాచారం. ఇప్పటికే రవితేజ తో ఇలియానా కిక్, దేవుడు చేసిన మనుషులు, అమర్ అక్బర్ ఆంటోని.. సినిమాలలో నటించింది.
అందుకే ప్రేక్షకుల్లో రవితేజ-ఇలియానా కాంబినేషన్ మీద మంచి క్రేజ్ ఉంది. దాంతో మరోసారి ఈ జంట కలవబోతుందట. ఇక ఇలియానా.. నాగార్జున నటించబోయో బాలీవుడ్ రీమేక్ లోను నటించబోతుందన్న ప్రచారం జరుగుతోంది. మొత్తానికి టాలీవుడ్ లో న్యూట్రల్ లో ఉన్న ఇలియానా మళ్ళీ టాప్ గేర్ వేయబోతుందని అంటున్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?