ముజప్ఫర్నగర్(బీహార్), జనవరి16 : బీహార్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో నిరక్షరాస్యులే ఎక్కువ మంది పిల్లల్ని కంటారని ఆయన వ్యాఖ్యనించారు.
దేశంలో జనాభా నియంత్రణకు ప్రభుత్వం ప్రజల్లో చైతన్యం నింపి వారిని విద్యావంతులను చేయాలని ఆయన సూచించారు.
అక్షరాస్యతతోనే అన్ని సమస్యలను పరిష్కరించవచ్చనీ, ప్రజలను విద్యావంతులను చేయడం ద్వారా కుటుంబ నియంత్రణ కూడా అమలు అవుతుందనీ ఆయన చెప్పారు. చదువుకున్న వారికి పిల్లల సంఖ్య తక్కువగా ఉంటుందన్నారు.
ఇప్పటికే భారతదేశం జనాభాలో ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉందని ఆయన అన్నారు.
2024 నాటికి మన దేశ జనాభా చైనాను మించిపోతుందని ఆయన చెప్పారు.
previous post
next post