ఆంధ్రా మాల్యా గా పేరు తెచ్చుకున్న రాజ్యసభ సభ్యుడు,కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి విదేశీ యాత్రకు బ్రేకులు పడ్డాయి.ఆయన అమెరికా వెళ్లేందుకు ఢిల్లీ ఎయిర్పోర్టుకు చేరుకోగా ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకోవడం జరిగింది.
ఓ బ్యాంకును మోసం చేసిన కేసులో సుజనా చౌదరి మీద లుకౌట్ నోటీసు జారీ కావడంతో విమానాశ్రయంలోని ఇమ్మిగ్రేషన్ అధికారులు దాన్ని చూపి ఆయన్ను వెనక్కి పంపేశారు.కొద్దిగా వెనక్కి వెళితే నోటా ఇరవై డొల్ల కంపెనీలను చూపించి ఒక బ్యాంకు నుండి సుజనా చౌదరి ఆధ్వర్యంలోని కంపెనీ దాదాపు ఆరువేల కోట్ల రూపాయల రుణాన్ని తీసుకుని దాన్ని ఎగ్గొట్టింది.ఈ మేరకు ఫిర్యాదు అందడంతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది.2018 నవంబర్ ఇరవై నాలుగో తేదీన హైదరాబాద్ పంజాగుట్టలోని ఆ కంపెనీపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు దాడులు జరిపారు.ఈ సందర్భంగా నూరుకుపైగా డొల్ల కంపెనీలకు చెందిన రబ్బర్ స్టాంపులు దొరికాయని అధికారులు ప్రకటించారు.అదే సందర్భంలో సుజనాచౌదరి కంపెనీకి సంబంధించిన దాదాపు మూడు వందల కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులను ఆరు లగ్జరీ కార్లను,కీలక డాక్యుమెంట్లను కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సీజ్ చేసి అటా్చు చేశారు.ఆ కేసు ఇంకా నడుస్తూనే ఉంది.దానికి సంబంధించే లుకౌట్ నోటీసు కూడా జారీ అయింది.
ఈ క్రమంలోనే ఇమ్మిగ్రేషన్ అధికారులు సుజనా చౌదరి అమెరికా వెళ్లకుండా అడ్డుకుని వెనక్కు పంపారు.తెలుగుదేశం పార్టీకి చెందిన సుజనాచౌదరి కేంద్రమంత్రిగా కూడా పని చెయ్యటం మొన్నటి ఎన్నికల్లో టిడిపి ఘోరంగా ఓడిపోయాక బిజెపి లో చేరడం తెలిసిందే.అయితే విచిత్రమేమిటంటే తెలుగుదేశం పార్టీలో ఉండగా సుజనా చౌదరిని ఆంధ్రా మాల్యాగా బిజెపి ఆంధ్రప్రదేశ్ నేత జీవీఎల్ నరసింహారావు అభివర్ణించారు.ఆ తర్వాత కమలనాథులు సుజనాచౌదరికి తమ పార్టీ కండువా కప్పారు.కాకుంటే ఇప్పటికీ సుజనా చౌదరిని బీజేపీ అగ్రనాయకత్వం పూర్తిగా విశ్వసించడం లేదని ఆయన్ను టీడీపీ వాసనలు పోలేదని అనుమానిస్తోందని సమాచారం.ఈ మేరకు ఏపీ పార్టీ చీఫ్ సోము వీర్రాజు హైకమాండును అలర్ట్ చేశారట.రాష్ట్రంలో సుజనాచౌదరి అనుచరులుగా పేరొందిన వారికి బిజెపిలో షాక్ ట్రీట్మెంట్ తప్పడం లేదు.ఈమధ్య సుజనాచౌదరి అనుచరుడైన బీజేపీ నేత లంకా దినకర్ ని సోము వీర్రాజు సస్పెండ్ చేయటం ఇందుకు నిదర్శనం.ఇప్పుడు తాజాగా ఎయిర్పోర్ట్ ఉదంతాన్ని చూస్తే సుజనాచౌదరికి చుట్టూ బలమైన వలే అల్లు కొంటున్నట్లు గోచరిస్తోంది.