మనిషి జీవితం ఆరోగ్యం గా, పుష్టిగా సంపూర్ణ ణం గా ఉండాలంటే, ప్రతిరోజూ మన ఆహారం లో ఆవు నెయ్యిని తప్పనిసరిగాచేర్చుకోవాలి. డబ్బు లేకపోతే అప్పు చేసైనా ఆవు నెయ్యిని కొని ప్రతిరోజూ ఆహారంలో వాడాలని పెద్దలు హాస్యమాడుతుంటారు. దాని అర్ధం డబ్బును సంపాదించుకోవచ్చుకానీ ఆరోగ్యం పాడైతే తిరిగి తెచ్చుకోవడం కష్టమని పెద్దలు హెచ్చరిస్తూ ఆ విధం గా చెబుతుంటారు.
ఆవు నెయ్యి లైట్ యెల్లోకలర్ లో ఉంటుంది. అందులో కెరోటిన్ విటమిన్ ఎ కు ఇంకో రూపం. ఈ పదార్థం వలనే ఆవు పాలల్లో ను నేతిలో విటమిన్ ఎ పుష్కలం గా దొరుకుతుంది. మిగిలిన నేతుల్లో విటమిన్ ఎ లేకపోవడం వలన వాటికి పసుపు రంగు ఉండదు. ఈ కారణం వలన ఆవు నెయ్యి చాలా చాలా మంచిదంటారు. ఆవు నెయ్యి ఆహారం లో తీసుకోగానేచాల త్వరగా శరీరంలోని అణువణువులోకి చేరిపోయి, శక్తిని వచ్చేలా చేస్తుంది. వెన్నె వేడి చేసి నెయ్య చేయడంతోనే కొంత విటమిన్ నష్టం జరుగుతుంది.
మళ్ళీ, మళ్ళీ వేడి చేయడం వల్ల విటమిన్ ఎ పూర్తిగా నష్టపోతాం. కాబట్టి వేడి చేసేటప్పుడు పాత్ర మీద ఏదైనా గట్టి మూత పెట్టడంవలన విటమిన్ ఎ ను కాపాడవచ్చట. క్రమం తప్పకుండా రోజూ ఆవు నేతిని తీసుకోవడం వల్ల ఎముకల పటుత్వం, ఎముకల్లో ఉన్న మూలుగు రూపాంతరం చెందుతుందని, మాటలను స్పష్టంగా పలికేలా చేస్తుందని ఆయుర్వేదం తెలియచేస్తుంది.ఇంకా చెప్పాలంటే ఆరోగ్యానికి పునాది లాంటిది ఆవు నెయ్యి.
మానసిక ఆందోళనలను, ఉద్రేకాలను, బలహీనతలను సమర్థవంతం గా అరికట్టి, మనస్సుకు ప్రశాంతత్వాన్ని కలిగిస్తుంది. అన్ని సమస్యలకు కారణమైన రజోగుణాన్ని, తమో గుణాన్ని తగ్గించి సాత్విక గుణాన్ని పెంచి.. మానవుణ్ణి మేధావి గా చురుకుగా, కాంతివంతుడుగా చేసే శక్తి ఆవు నెయ్యి లో పుష్కలం గా ఉందట .ఏ వ్యాధి బారిన పడకుండా , శక్తి సన్నగిల్లకుండా ఆవు నెయ్యి కాపాడుతుందట.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?