Water : మన భూమి 70 శాతం నీటితో నిండి ఉన్నట్టే మనశరీరం కూడా 70 శాతం నీటితోనే నిండి ఉంటుంది. మనం ఆరోగ్యం గా ఉండాలంటే సరిపడినంత నీరు Water ఖచ్చితం గా తాగవలిసిందే.
నీరు కేవలం దాహం తీర్చడమే కాకుండా.. జింక్, ఐరన్,కాపర్, అయోడిన్, భాస్వరం, మెగ్నీషియం, ఫ్లోరైడ్ ,కాల్షియం, సోడియం, పోటాషియం, క్లోరైడ్ వంటి పోషకాలను శరీరానికి అందజేస్తుంది.కాబట్టి రోజుకు తగినంత నీరు తాగడం అనేది చాలా ముఖ్యం. నీరు ఎక్కువతీసుకోవడం వలన మనం తీసుకునే ఆహారంలోని పోషకాలను గ్రహించి , వ్యర్థ పదార్థాలను బయటకు పంపుతుంది . ఇక, ఆరోగ్యకమైన ఆహారం తీసుకుని, తగిన వర్కౌట్స్చేసినాకూడాసరిపడినన్ని నీరు తీసుకోకపోతే డిహైడ్రేషన్ జరిగి పొట్టతో పాటు బరువు కూడా పెరుగుతారు.
శరీరంలో 70 శాతం నీటితోఉండడం వలన జీవక్రియ సక్రమంగాజరిగి, వ్యర్థ పదార్థాలను బయటకు పంపడం లో నీరు ప్రధానమైనది. తగినంత నీరు తీసుకోనప్పుడు శరీరం నీటిని నిల్వఉంచుకోవడం మొదలు పెడుతుంది. తద్వారా బరువు పెరగడం, డిహైడ్రేషన్ కి కారణమవుతుంది.
సరైన మొత్తంలో ఆహారం, నీరు తీసుకోకపోవడంఅనేది ఒకదానితో మరోకటి లింక్ అయి ఉంటాయి. డీహైడ్రేషన్ జరిగినప్పుడు.. మెదడుకు శరీరం సిగ్నల్స్ పంపుతోంది. దీనికి ప్రతిస్పందనగా.. దాహం, ఆకలి అవుతున్న సంకేతాలను మెదడు పంపడం జరుగుతుంది. ఇలాంటి సందర్భాలు అతిగా తినేందుకు దోహదపడతాయిఆహారం ఎక్కువగా తీసుకోవడానికి కారణమవుతాయి.
బరువు తగ్గాలని అనుకునే వారు రోజుకు కనీసం 2 లీటర్ల నీరు తాగాలి. ఒకవేళ బరువు తగ్గడానికి వ్యాయమం చేస్తుంటేమాత్రం ప్రతి రోజు 3 లీటర్లు లేదా అంతకంటే ఎక్కువనీరు తాగాలి . రోజు మొత్తం లో కొద్దీ కొద్దీ గా తాగుతూ శరీరానికి నీటి కొరత లేకుండా చూడాలి. భోజనం చేయడానికి 30 నిమిషాల ముందు 500 మి.లీ నీరు తాగడం వలన కొద్దిపాటి ఆకలి తగ్గించి.. అతిగా తినకుండా చేసి బరువు తగ్గడానికి కారణమవుందని ఓ అధ్యయనం స్పష్టం చేసింది . పండ్లు, పండ్ల రసాలు తీసుకోవడం వలన కూడా శరీరం డీహైడ్రేడ్ కాకుండా జాగ్రత్త పడవచ్చు.