మన నిత్య జీవితం లో సువాసనలకు ఎంతో మన ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా ఇవి నాడీ వ్యవస్థను ఉత్తేజితం చేస్తాయి. చిటికెలో మన మనస్సులోని ఆలోచనలు మార్చేస్థాయి. సుగంధ ద్రవ్యాలని రెండు రకాలుగా ఉపయోగిస్తాం. మొదటిది శరీరం పై వాడితే , రెండవది పరిసరా లను సుగంధ భరితం చేసేవి. శుభకార్యాలకు లేదా ఏదైన పార్టీకి వెళ్ళినా, అక్కడి ఆవరణం అంతా పెర్ఫ్యూమ్ వాసనే ఎక్కువగా వస్తుంటుంది.
కొందరు బాగా ఘాటు వాసన వచ్చే పెర్ఫ్యూమ్ వాడితే ఇంకొకరు తక్కువ గాఢత ఉన్న పెర్ఫ్యూమ్ వాడతారు. ఒక పెర్ఫ్యూమ్ మీ స్వాభావాన్ని తెలియచేస్తుంది అన్నసంగతి మీకు తెలుసా?స్వభావంతెలియచేయడం మాట పక్కన పెట్టి దానివలన అనేక ఇతర వ్యాధులు వస్తున్నాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉండే లా బాగా తక్కువ ధరలో లభ్యమయ్యే సెంట్లు, ఇతర సుగంధ ద్రవ్యాలు మార్కెట్లోకి ఎక్కువగా వస్తున్నాయి . ఈ చవకబారు సుగంధ ద్రవ్యాలతో కొన్ని వ్యాధులు, అలర్జీలు పెరిగాయంటున్నారు అధ్యయనవేత్తలు. మనం వాడే సుగంధ ద్రవ్యాలు కృత్రిమ రసాయనాలను కలిగి ఉండడం వలన చర్మానికి హాని కలుగుతుంది.
కనుక బాదం నూనెలో కొన్ని చుక్కల సుగంధ తైలం ను కలిపి ఆ మిశ్రమాన్ని చర్మానికి వాడటం వలన మంచి వాసనను వెదజల్లుతుంది. దీని వాడకం వలన ఎలాంటి దుష్ప్రభావాలు కూడా ఉండవు. కొందరు వ్యక్తులు తమ ప్రైవేట్ పార్ట్ వద్ద కూడా సుగంధ పరిమళాలను వాడుతూ ఉంటారు . వాళ్ళు తమ అండర్ గార్మెంట్స్ వద్ద టాల్కం పౌడర్ రాసుకోవడం వంటివి చేస్తుంటారు. అయితే ఆ ప్రదేశం లో సుగంధ పరిమళాలను ఉపయోగించడం కంటే ప్రతిరోజూ శుభ్రంగా స్నానం చేయడం, ఎప్పటికప్పుడుశుభ్రంగా ఉండే అండర్ గార్మెంట్స్ వేసుకోవడం ఆరోగ్యకరం అంటున్నారు నిపుణులు.