Thirumala: ఇప్పుడు ధనుర్మాసం నడుస్తోందని అందరికీ తెలిసిందే. అదికూడా ఈరోజే మొదలయ్యింది. ఈ మాసంలో మన తిరుమల శ్రీవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు మన ఆలయ అర్చకులు. అలాగే సుప్రభాతానికి బదులు ఈరోజు నుండి అర్చకులు తిరుప్పావై పఠిస్తారు. ఎందుకంటే.. ఈరోజు నుండి ధనుర్మాసం ఘడియలు ప్రారంభం అవుతున్నాయి కాబట్టి. ఈ ధనుర్మాసం జనవరి 14వ తేదీ వరకు కొనసాగింపు గా ఉంటుంది. ఇక అప్పటి వరకు శ్రీవారి అర్చకులు ఆలయంలో చాలా ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తారు.
తిరుప్పావై ఏమిటి?
అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుని తమ పూజతో.. సేవతో మెప్పిస్తారు అర్చకులు. ఈ నెలలో గోదాదేవి రచించిన 30 పాశురాలను పఠిస్తూ ఉంటారు వీరు. వీటినే “గోదాదేవి పాశురాలు” అని పిలుస్తారు. సుప్రభాతానికి బదులుగా ఈ 30 రోజుల పాటు కూడా ఇవే పఠిస్తూ ఉంటారు. అలాగే తులసి దళాలుకు బదులుగా బిల్వ పత్రాలతో పూజలు చేస్తారు. అలాగే ఈ నెలలో శ్రీ కృష్ణ భగవాన్ పూజలు కూడా నిర్వహిస్తారు.
TTD: తిరుమల కొండ మీద వసతి దొరక్క ఇబ్బంది పడుతున్నారా? ఒక్క ఫోన్ తో వసతి పొందేవకాశం వినియోగించుకొండి !!
భక్తులు ఇపుడు ఆలయానికి వెళ్తున్నారా?
అలాగే 5వ రోజు మోహినీ అవతారం సందర్భంగా అమ్మవారికి అలంకరించిన పుష్ప మాలలు, తులసి మాలలు స్వామివారికి సమర్పిస్తారు. ప్రస్తుతం కరోనా కారణం చేత ఈ రకమైన పూజలన్నీ సైలెంట్ గానే చేస్తున్నారు. అదే మామ్మూలు రోజులైతే తిరుమల కొండ కిక్కిరిసి పోతుంది. ముఖ్యంగా ఈ నెలలో భక్తులు శ్రీవారి ఆలయానికి పోటెత్తుతారు.
TTD: టీటీడీ కాంట్రాక్ట్ ఉద్యోగులకు షాక్ ఇచ్చిన పోలీసులు..! 107 మందిపై కేసులు నమోదు..!!
కానీ నేడు పరిస్థితి తారుమారైంది. తిరుమల బోసిపోయింది. శ్రీవారు ఒంటరివారయ్యారు. పరిస్తుతులు ఎలా వున్నా, ఆలయ అర్చకులు మాత్రం శ్రీవారి సేవలో నిమగ్నమైపోతుంటారు.