డార్లింగ్ ప్రభాస్ బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ 3డి సినిమాలో నటించబోతున్న సంగతి తెలిసిందే. జనవరి నుంచి ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్ళబోతోందని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా పనులన్ని శరవేగంగా సాగుతున్నాయి. అందుకే ఇప్పుడు ఈ సినిమాలో నటించబోయో సీత పాత్ర గురించి మళ్ళీ టాక్ మొదలైంది. భారతీయ పురాణేతిహాసం రామాయణం ఆధారంగా ఈ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. కాగా పాన్ ఇండియా కేటగిరీలో తెరకెక్కనున్న 3 డి యాక్షన్ డ్రామా గా తెరకెక్కబోతున్న ఈ సినిమాలో ప్రభాస్ శ్రీరాముడి పాత్రలో నటిస్తుండగా.. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ లంకేష్ గా రావణుడి పాత్రలో కనిపించనున్నారు.
లక్ష్మణుడి పాత్రకు సోనూకి టిటులీ ఫేం.. బాలీవుడ్ నటుడు సన్నీ సింగ్ ని ఎంపిక చేశారన్న టాక్ బాలీవుడ్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ విషయం పక్కన పెడితే ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి సీత గా నటించే హీరోయిన్ విషయం లో పెద్ద సస్పెన్స్ నెలకొంది. అయితే ప్రచారంలో మాత్రం చాలామంది స్టార్ హీరోయిన్స్ పేర్లు ప్రచారంలో ఉన్నాయి. భారీ ప్రాజెక్ట్ కాబట్టి వరల్డ్ వైడ్ గా పాపులారిటీ ఉన్న హీరోయిన్ అయితే సినిమాకి బాగా ప్లస్ అవుతుందన్న ఉద్దేశ్యంలో ఉన్నారు మేకర్స్.
అయితే ఇటీవల ఈ సినిమాకి సంబంధించి ప్రభాస్ దర్శకుడు ఓం రౌత్ తో ముంబై లో చర్చలు జరిపాడు. ఆ సమయంలో ఒక క్రేజీ హీరోయిన్ ని ఫైనల్ చేసినట్టు సమాచారం. టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 1 నేనొక్కడినే ఆ తర్వాత అక్కినేని నాగచైతన్య తో దోచేయ్ సినిమాలలో నటించిన కృతి సనన్ ని ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. అయితే ప్రాజెక్ట్ మొదలయ్యే ముందు ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటించనున్నారని అంటున్నారు. మరి ఇది ఇందులో ఎంతవరకు వాస్తమన్నది చూడాలి. ఇక ఈ సినిమాని టీసిరీస్ బ్యానర్ పై భూషన్ కుమార్ తోపాటు ఓం రౌత్ కలిసి నిర్మించనున్నారు.