ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అమెరికా ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల కౌంట్ డౌన్ మొదలయింది. రిపబ్లికన్ పార్టీ తరపున అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రెండోసారి పోటీపడగా, డెమోక్రటిక్ పార్టీ తరపున జో బైడెన్ అధ్యక్షుడిగా, భరత్ సంతతికి చెందిన కమల్ హర్రీస్ ఉపాధ్యక్షురాలిగా పొట్టి పడుతున్నారు అనే విషయం తెలిసిందే. నువ్వా నేనా అనే రీతిలో సాగిన ఎన్నికల ప్రచారం సాగింది. జో బైడెన్, తన ఎన్నికల ప్రచారంకి కావాల్సిన నిధులు సహాయం చేసిన వారి పేర్లని వెల్లడించారు. అయితే జో బైడెన్ కి సహాయం చేసిన వాళ్లలో ఎక్కువ మంది భారతీయ అమెరికన్ లు ఉండడం గమనార్హం. ఈ సంవత్సరం తన ప్రచారం కోసం 100,000 డాలర్స్ నిధులు సేకరించారు అని అయినా తెలిపారు.
800 మంది ప్రధాన దాతల జాబితాలో కొన్ని డజన్ల మంది భారతీయ అమెరికన్లు ఉన్నారు. ప్రసిద్ధ సమాజ నాయకులు స్వదేశ్ ఛటర్జీ, రమేష్ కపూర్, శేకర్ ఎన్ నరసింహన్, ఆర్ రంగస్వామి, అజయ్ జైన్ భూటోరియా భారతీయ అమెరికన్ల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారు. ఇతర ప్రముఖ భారతీయ అమెరికన్ బండ్లర్లలో నీల్ మఖిజా, రాహు, ప్రకాష్, దీపక్ రాజ్, రాజ్ షా, రాజన్ షా, రాధిక షా, జిల్ మరియు రాజ్ సింగ్, నిధి ఠాకర్, కిరణ్ జైన్, సోనీ కల్సి, బేలా బజారియా ఉన్నారు. భారతీయ అమెరికన్ కాంగ్రెస్ మహిళ ప్రమీలా జయపాల్ కూడా జాబితాలో ఉన్నారు.
మరోవైపు అమెరికా అధ్యక్ష ఎన్నికల పై జరిపిన సర్వేలన్నీ జో బైడెన్ కు అనుకూలంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ కంటే జో బైడెన్ ప్రజారోగ్య సంక్షోభాన్ని ప్రస్తుతం సమర్థవంతంగా ఎదుర్కొంటారని అమెరికన్ ఓటర్లు చాలామంది విశ్వసిస్తున్నట్లు గా సర్వేలు చెబుతున్నాయి. ట్రంప్ కంటే బైడెన్ ఎక్కువ ప్రజాభిమానాన్ని సంపాదించారని తాజా సర్వేలు పేర్కొంటున్నాయి. ఒకపక్క సర్వేలన్నీ ట్రంప్ కు వ్యతిరేకంగా, ప్రజలు తీర్పు ఉండబోతుందని చెబుతుంటే ఇప్పటికే కరోనా కారణంగా ఆరోగ్య సంక్షోభంలో, ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న అమెరికాను గట్టెక్కించడానికి ప్రజలు ఎవరి వైపు మొగ్గు చూపుతారనేది ఆసక్తికర అంశం. అమెరికా అధ్యక్ష ఎన్నికలలో అధ్యక్షుడిగా పట్టం కట్టడానికి కీలక భూమిక పోషించే వారిలో తెలుగువారు వుండడం గమనార్హం. ఏది ఏమైనా ఈ ఎన్నికలు అధ్యక్షుడిగా ఎవరిని కూర్చోబడతాయి అనేది తేలేందుకు కౌంట్ డౌన్ మొదలైంది.