Cm Jagan: ఇటీవల టాలీవుడ్ బడా నటులతో AP CM జగన్ భేటీ అయిన విషయం అందరికీ తెలిసిందే. అందులో భాగంగా ఇండస్ట్రీకి సంబంధించిన పలు అంశాలపైన వారు మాట్లాడుకున్నారు. ఈ నేపథ్యంలో AP ప్రభుత్వ వ్యవహారం చూస్తుంటే సీని ఇండస్ట్రీని పూర్తిగా విశాఖకు తరలించే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనబడుతోంది. దానికి కావలసిన అవసరాలలో భాగంగా భూమి అవసరం వుండటంతో ముందుగా భూసేకరణను చేపట్టాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశించినట్టుగా సమాచారం.
Manchu Lakshmi: ఆనందంతో ఉప్పొంగిపోతున్న మంచు లక్ష్మి..కారణం అదే..!
Cm Jagan: భూసేకరణ ఎక్కడ?
ఈ సమావేశంలో జగన్ మాట్లాడుతూ విశాఖలో స్టూడియోల ఏర్పాటుకు స్థలాలు ఇస్తామని మాటిచ్చారు. దాని తరువాత ఈ భూసేకరణ అంశం సదరు అధికారులకు మూవ్ చేయమని జగన్ సూచించినట్టుగా తెలుస్తోంది. ఇందులో భాగంగానే విశాఖతో పాటుగా రాజమహేంద్రవరం, తిరుపతిలోనూ స్టూడియోల ఏర్పాటుకు సంబంధించి భూమిని సేకరించాలని ఏపీ సర్కార్ నిర్ణయించినట్టు సమాచారం. ఈ మేరకు ప్రభుత్వానికి చెందిన భూములను సైతం గుర్తించాలని చెప్పారట.
Jagan Chiranjeevi: జగన్ – చిరు భేటీ లీక్ వీడియోతో తమ్మారెడ్డి సహా హర్ట్ అయిన మెగా ఫ్యాన్స్..
మరింత సమాచారం:
స్టూడియోల ఏర్పాటుకు భూమి అవసరం కావడం వలన అవసరమైనంత భూమిని రైతుల నుంచే సేకరించాలని ప్రభుత్వం యేచిస్తోందని తెలుస్తోంది. ఇకపోతే ఇలా ప్రతి దానికీ రైతుల నుంచి భూమిని సేకరించడం అనే అంశం పైన అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంత చేసీ స్టూడియోల ఏర్పాటుకు భూములు ఇస్తే.. భూమిని తీసుకున్న వారు అందులో స్టూడియో ఏర్పాటు చేయకపోతే మరలా ఇక్కడ అమరావతి రాజధాని ఉదంతం మరలా పునరావృతం అవుతుందని విశ్లేషకుల మాట!