రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ మహమ్మారి ఊహించని విధంగా వ్యాప్తి చెందుతోంది. తెలంగాణ రాష్ట్రంలో కరోనా నిర్ధారణ పరీక్షలు జరగకుండానే కరోనా కొత్త పాజిటివ్ కేసులు బయటపడటంతో అక్కడ ప్రభుత్వం లో మరియు వైద్య రంగంలో టెన్షన్ నెలకొంది. ఇక ఏపీలో అయితే కరోనా నిర్ధారణ పరీక్షలు భారీగానే జరుగుతున్న పాజిటివ్ కేసులు కొత్తవి ఊహించని విధంగా బయటపడటంతో ఇక్కడ కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉండగా మొదటిలో చేపట్టిన లాక్ డౌన్ సమయములో ఒంగోలు జిల్లాలో చాలావరకు పాజిటివ్ కేసులు బయటపడిన గాని లాక్ డౌన్ పర్ఫెక్ట్ గా అమలు చేసిన సమయంలో జీరో లో ఉండి అంతా క్లియర్ అయిపోయాయి.
కానీ ఇటీవల ఆంక్షల సడలింపులు ఎత్తివేసిన తరువాత పాజిటివ్ కేసుల విషయంలో కొంతమంది అధికారుల నిర్లక్ష్యం మరియు వైద్యులు చేస్తున్న పొరపాట్ల వల్ల జిల్లాలో ఊహించని విధంగా కొత్త పాజిటివ్ కేసులు బయటపడటంతో ప్రకాశం జిల్లా మొత్తాన్ని ఈ నెల 21 నుండి 14 రోజులపాటు పూర్తిస్థాయి లాక్ డౌన్ అమలు చేయాలని కలెక్టర్ డిసైడ్ అయ్యారు. ముఖ్యంగా కరోనా వైరస్ ప్రభావం ఒంగోలు నగరంలో ఎక్కువగా ఉండటంతో ఊహించని విధంగా కేసుల బయటపడటంతో జిల్లా కేంద్రాన్ని పూర్తి స్థాయిలో కంటైన్మెంత్ జోన్ గా ప్రకటించారు. ఇప్పటి వరకూ ప్రకాశం జిల్లాలో 268 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు కాగా, ప్రస్తుత పరిస్థితి బట్టి సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీంతో ముందుగానే మహమ్మారి వైరస్ ని కట్టడి చేయడం కోసం జిల్లా కలెక్టర్ ప్రకాశం జిల్లా ని కంటైన్మెంత్ జోన్ గా ప్రకటించడం జరిగింది.