Big Breaking: ఈరోజు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్య శాఖ అధికారులతో పాటు ప్రభుత్వ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో కరోనా వైరస్ తగ్గుముఖం పట్టడంతో పాటు.. కేసుల సంఖ్య కూడా చాలావరకు తగ్గిపోవడంతో.. ప్రస్తుతం రాష్ట్రంలో అమలవుతున్న కర్ఫ్యూ పై చర్చించడం జరిగింది.
ఈ నేపథ్యంలో దాదాపు తొమ్మిది రాష్ట్రాలలో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు వెసులుబాటు.. కల్పించగా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న… మరి కొన్ని జిల్లాలలో.. ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకే కర్ఫ్యూను అమలు చేస్తూ ఉన్న పరిస్థితి. ఇటువంటి తరుణంలో.. చాలా వరకు కేసులు తగ్గిపోవడంతో.. రాష్ట్రంలో మూసుకుపోయిన థియేటర్లు జూలై 8 వ తారీకు నుండి తెరుచుకునే రీతిలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. కేవలం 50 శాతం సిట్టింగ్ విధానం ఉండేలా.. ఏపీలో థియేటర్లు జూలై 8వ తారీఖు నుండి తెరుచుకొనే రీతిలో తాజాగా జరిగిన సమీక్ష సమావేశంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది.