దేశ రాజధాని ఢిల్లీలో మహమ్మారి కరోనా భయంకరంగా విలయతాండవం చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. రోజురోజుకి రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కొత్త కేసులు బయట పడుతున్న తరుణంలో చైనాలో వ్యూహన్ నగరంలో నిర్మించిన 1000 ఆసుపత్రుల పడకల కంటే పది వేల ఆసుపత్రుల పడక కలిగిన కరోనా ఆసుపత్రి ఢిల్లీ సర్కార్ అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఈ స్థాయిలో కరోనా ఢిల్లీలో మరణ మృదంగం వినిపిస్తుంటే శుక్రవారం ఢిల్లీలో ఒక్కసారిగా సాయంత్రం ఆరు గంటల యాభై నిమిషాలకు భూకంపం వచ్చింది.
రిక్టర్ స్కేల్ పై 4.7 తీవ్రతగా నమోదైంది. 3 నుంచి నాలుగు సెకన్ల పాటు భూమి కంపించడంతో ఢిల్లీ ప్రజలంతా ఒక్కసారిగా భయంతో బయటకు పరుగులు తీశారు. ఒక పక్క కరోనా వైరస్ టెన్షన్ మరో పక్క భూమి కంపించడంతో ఢిల్లీ ప్రజలంతా ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇదిలా ఉండగా గురుగ్రామ్ కు 43 కిలోమీటర్ల దూరంలో భూకంపకేంద్రం ఉన్నట్టుగా అధికారులు గుర్తించారు. దీంతో ఇటీవల కొన్ని రోజుల నుండి ఇలా ప్రకంపనాలు రావటంతో ప్రకృతి దేశ రాజధాని ఢిల్లీ ని టార్గెట్ చేసిందని కొంతమంది వరుసగా చోటు చేసుకుంటున్న ఇటువంటి ఘటనలు గురించి కామెంట్ చేస్తున్నారు.