బీజేపీ సహకారంతో మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన శివసేన తిరుగుబాటు నేత ఏక్ నాథ్ శిండే ఏడు వారాల తరువాత మంత్రులకు శాఖలను కేటాయించారు. తనతో పాటు డిప్యూటి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కు కీలక శాఖలను అప్పగించారు. తొలుత ఏక్ నాథ్ శిండే ప్రభుత్వంలో భాగస్వామ్యం కావడానికి. ఉప ముఖ్యమంత్రి పదవి స్వీకరించడానికి సైతం అంగీకరించని బీజేపీ కీలక నేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ పార్టీ హైకమాండ్ ఆదేశాలతో అంగీకరించారు. మంగళవారం 18 మందితో మంత్రివర్గ విస్తరణ చేసిన ఏక్ నాథ్ శిండే నేడు వారికి శాఖలను కేటాయించారు. పట్టణాభివృద్ధి శాఖతో పాటు పర్యావరణం, మైనారిటీ, రవాణా, విపత్తు నిర్వహణ మంత్రిత్వ శాఖలను తన వద్దనే ఉంచుకున్న సీఎం ఏక్ నాథ్ శిండే.. ప్రభుత్వంలో కీలకమైన హోంశాఖ, ఆర్ధిక, ప్రణాళికా శాఖలను దేవేంద్ర ఫడ్నవీస్ కు అప్పగించారు.
బిజెపి మంత్రి రాధాకృష్ణ విఖే పాటిల్ కి రెవెన్యూ, పశుసంవర్ధక మరియు డెయిరీ శాఖలను అప్పగించారు. భాజపా మంత్రి సుధీర్ ముంగంటివార్ను అటవీ శాఖ మంత్రిగా నియమించారు, ఇది ఆయన గతంలో నిర్వహించారు. సాంస్కృతిక వ్యవహారాలు, మత్స్య సంపద శాఖలను ఆయనే చూస్తారు. రాష్ట్ర బిజెపి మాజీ అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ కు ఉన్నత మరియు సాంకేతిక విద్యా శాఖను కేటాయించారు. ఆయనే శాసనసభా వ్యవహారాలను చూస్తారు. శివసేన తిరుగుబాటుదారుల ఏక్నాథ్ షిండే శిబిరం నుంచి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన దీపక్ కేసర్కర్ కు పాఠశాల విద్య శాఖకు కొత్త మంత్రిగా, అబ్దుల్ సత్తార్కు వ్యవసాయ శాఖను కేటాయించారు. శంభురాజ్ దేశాయ్ కి రాష్ట్ర ఎక్సైజ్ డ్యూటీ కేటాయించారు.
జయసుధతో తెలంగాణ బీజేపీ మంతనాలు..చేరికపై జయసుధ కండీషన్లు ఇవి