House: ప్రస్తుత ప్రపంచంలో కుటుంబాన్ని ముందుకు నడిపించడం అనేది కత్తి మీద సాము లాగా ఉంది. ముఖ్యంగా మహమ్మారి కరోనా వైరస్ రావడంతో ప్రపంచ వ్యాప్తంగా అనేక ఉద్యోగాలు కోల్పోవటం మాత్రమే కాక… చాలా కంపెనీలు దివాల తీసేస్తున్నారు. మరోపక్క ప్రభుత్వానికి కూడా పెద్దగా రాబడి లేని పరిస్థితి. దీంతో చాలా వరకు ప్రపంచవ్యాప్తంగా ఖాళీ ఖజానా తో ప్రభుత్వాలు ప్రజలను పరిపాలన చేస్తూ ఉన్నాయి. ఎక్కడికక్కడ మహమ్మారి కరోనా,, కారణంగా ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలకు లావాదేవీలు ఆగిపోవటంతో… వచ్చే రాబడి కంటే ప్రభుత్వాలకు ఖర్చు.. తడిసి మోపెడు అవుతుంది. ఇటువంటి తరుణంలో సమాజంలో సొంత ఇల్లు కొనుక్కోవడం అనేది చాలామందికి ఒక కలగా మిగిలి పోయింది.
సామాన్యుడికి అదే రీతిలో పేదవారికి, మధ్యతరగతి ప్రజలకు.. సొంతిల్లు ఉండాలి అని చాలా కలలుకంటారు. వారి కళలను సొంతం చేయడానికి ప్రభుత్వాలు కూడా కొద్దోగొప్పో ఎన్నికల టైంలో హామీలు ఇస్తూ ఉంటాయి. ఇదిలాఉంటే ఇటలీలో 87 రూపాయలకే ఇల్లు ఇవ్వటానికి అక్కడి ప్రభుత్వం రెడీ అవ్వడం ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. విషయంలోకి వెళితే ప్రపంచప్రఖ్యాతి దేశం ఇటలీ దేశంలో రోమ్ నగరం కి 60, 70 కిలోమీటర్ల దూరంలో ఊరు ఉంటుంది. చుట్టూ అందమైన ప్రకృతి అందాలు చూడ ముచ్చటగా ఉంటాయి. ఎంతో ఆహ్లాదకరమైనఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. బతికితే ఇక్కడ ప్రశాంతంగా బతకాలి అన్న తరహాలో ఆ ప్రదేశం ఉంటుంది.
అటువంటి ప్రాంతంలో అక్కడి ప్రభుత్వం 87 రూపాయలకు ఇల్లు ఇవ్వడానికి తాజాగా సన్నద్ధమైంది. అంత తక్కువ ధరకు ఇటలీ ప్రభుత్వం ఇవ్వడానికి గల కారణం అక్కడ.. ప్రజలు ఉండటం మానేశారు. చాలా సంవత్సరాల నుండి ఆ ప్రాంతాలలో చుట్టుప్రక్కల భూకంపాలు రావడంతో.. అక్కడ ఉన్న ప్రజలు దాదాపు వలసలుగా ఉన్న ఇల్లు లను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఈ పరిణామంతో అక్కడ ఉన్న చాలా ఖాళీ ఇల్లులు శిథిలావస్థకు చేరుకున్నాయి.
ఈ క్రమంలో అక్కడ మళ్లీ జన సంచారం పెరగాలని ఖాళీ అయిపోయిన ఇల్లులు నిండాలని.. ఇటలీ ప్రభుత్వం భావించి నష్టమైన గాని 87 రూపాయలకే.. అక్కడ ఇల్లు ఇవ్వడానికి ప్రభుత్వం డిసైడ్ అయ్యింది. ఇదే సమయంలో ఒక షరతు కూడా పెట్టడం జరిగింది. ఇల్లు కొనుక్కున్న వాళ్ళు మూడు సంవత్సరాలలో కట్టుకోవాలని తెలిపింది. ఒక యూరో కంటే తక్కువ గానే.. ఇటలీ ప్రభుత్వం ఇల్లు ప్రకటించడంతో చాలామంది ఈ వార్తపై అంతర్జాతీయ స్థాయిలో స్పందిస్తున్నారు. ఇదే తరహా స్కీమ్ ఇండియాలో గవర్నమెంట్ పెడితే బాగుంటుందని ఇండియన్స్ రియాక్ట్ అవుతున్నారు.