Breaking: సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు డ్రగ్స్ కేసు వార్తలు బయట పడుతూనే ఉంటాయి. అప్పట్లో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ రీతిగానే ఒక కేస్.. బయట పడటంతో చాలా మందిని.. పోలీసులు అప్పట్లో విచారించారు. ఆ తర్వాత బాలీవుడ్ స్టార్ హీరో సుశాంత్ సింగ్ డెత్ కేసులో కూడా డ్రగ్స్ కోణం బయటపడింది.
ఇప్పుడు ఇదే రీతిలో శాండిల్ వుడ్ లో ఇండస్ట్రీలో కొంత మంది ప్రముఖ నటీనటులు డ్రగ్స్ తీసుకుంటున్నట్లు ఎఫ్ ఎస్ ఎల్ రిపోర్ట్స్ వెల్లడించాయి. రిపోర్ట్స్ ఆధారంగా పేర్లు చూస్తే కన్నడ నటీనటులు సంజన గార్లని, రాగిణి ద్వివేది.. డ్రగ్స్ తీసుకున్నట్లు సరికొత్త వార్త ఇప్పుడు కర్ణాటక మీడియా లో వైరల్ అవుతుంది. కర్ణాటక మీడియా లో మాత్రమే కాక.. సౌత్ ఇండియాలో ఈ వార్త సెన్సేషనల్ గా మారింది.