Breaking: చరిత్రలో మొట్టమొదటిసారి సుప్రీంకోర్టు జడ్జిలు ప్రమాణ స్వీకారం కార్యక్రమాన్ని లైవ్ లో చూపించనున్నారు. ఏకంగా తొమ్మిది మంది జడ్జీలు ఒకేసారి ప్రమాణస్వీకారం చేయడం విశేషం. కొత్తగా నియమించిన న్యాయమూర్తులు ఈరోజు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
ఈరోజు ఉదయం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ.. ఈ తొమ్మిది మంది న్యాయమూర్తుల చేత ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. తాజాగా తొమ్మిది మంది జడ్జీలు ప్రమాణస్వీకారం తో సుప్రీం కోర్టు లో మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 33 కు చేరింది. ఈ తొమ్మిది మందిలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన హిమా కోహ్లీ తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పని చేయడం జరిగింది. ఇటీవల సుప్రీంకోర్టు కొత్తగా తొమ్మిది మందిని న్యాయమూర్తులుగా నియమిస్తూ రాష్ట్రపతి ఆమోదంతో కేంద్రం గెజిట్ ను విడుదల చేయడం జరిగింది.