టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఇంటిలోనే పోరు మొదలయిందని ఒక టాక్ వినవస్తోంది. స్వయానా కుమారుడు చినబాబు లోకేష్ బాబు తండ్రిపై అలిగి అమరావతికి పరిగెత్తి వచ్చాడట.
మళ్లీ చంద్రబాబు బతిమాలితే లోకేష్ చల్లబడి హైదరాబాద్ వెళ్లాడని సమాచారం.వివరాల్లోకి వెళితే లోకేష్ ఈ మధ్య రాజకీయంగా అన్ని విషయాలను పరిశీలిస్తున్నారు. 2024 ఎన్నికల్లో టీడీపీ గెలవకపోతే ఇక పార్టీ దుకాణం మూసుకునే పరిస్థితి వస్తుందని ఆందోళనగా ఉన్నాడట.. అందుకే మంచి మెరుగైన నేతలను ఎంపిక చేసుకొని తన వెంట ఉంచుకోవాలని.. అతిగా మాట్లాడే వాళ్లను ప్రోత్సహించవద్దని డిసైడ్ అయ్యాడట.. వాళ్ల వల్ల మిగతా నేతలు దూరం అవుతున్నారని.. పార్టీ నాశనం అవుతోందని లోకేష్ బలంగా నమ్ముతున్నాడట. ఎవరి వల్ల ఏ జిల్లాలో పార్టీకి నష్టం జరుగుతోందని లోకేష్ బాబు ఒక సర్వే చేయించుకున్నాడు
ఇందులో వచ్చిన నివేదిక ఆధారంగా తెలుగుదేశం పార్టీ బలంగా ఉండే కృష్ణా జిల్లాలో మాజీ మంత్రి దేవినేనిఉమామహేశ్వరావు వల్ల పార్టీకి నష్టం జరుగుతోందని లోకేష్ బాబు అంచనా వేశాడట .దేవినేనికి ఆ జిల్లాలో ఉన్న ఎవరికి పడదని తేల్చాడట.. దేవినేనికి ఇగో ఎక్కువని.. అతడు ఎవరిని కలుపుకొని పోడు అని రిపోర్టులు లోకేష్ కు అందాయట.అయితే తండ్రి చంద్రబాబు నాయుడు కృష్ణా జిల్లాల్లో దేవినేని ఉమామహేశ్వరరావుకు టాప్ ప్రియారిటీ ఇవ్వడాన్ని లోకేష్ గుర్తించాడు.దీంతో లోకేష్ తండ్రి చంద్రబాబును కలిసి దేవినేని ఉమామహేశ్వరరావుకు ప్రాధాన్యత తగ్గించమని సూచించాడట.తన సర్వేలన్నీ లోకేష్ చంద్రబాబు ముందుంచగా.. అవన్నీ ట్రాష్ అని ఆయన కొట్టిపారేసినట్టు పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.
లోకేష్ దీంతో చిన్న బుచ్చుకున్నాడని ,దేవినేనికి ప్రాధాన్యత తగ్గించమంటే చంద్రబాబు అంగీకరించకపోవడంతో అలిగి అమరావతి వచ్చాడని ఒక సమాచారం .దేవినేని విషయంలో తండ్రీకొడుకుల మధ్య పెద్ద ఎత్తున ఇంట్లో గొడవ జరిగిందని.. ఆ తరువాత హైదరాబాద్ నుంచి లోకేష్ విజయవాడకు వచ్చాడని సమాచారం. దీంతో చంద్రబాబు ఫోన్లో బుజ్జగిస్తే అప్పుడు చల్లబడి హైదరాబాద్ వెళ్లాడని టీడీపీ వర్గాలు అంటున్నాయి. ఈ వ్యవహారం టిడిపి లో హాట్ టాపిక్ గా మారింది చంద్రబాబు ఇంటా బయటా సమస్యలు ఎదుర్కొంటున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.