ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మూడు రాజధానులు దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. ఇదే క్రమంలో అమరావతి కాలగర్భంలో కలిసిపోనుంది. పేరుకి శాసన రాజధానిగా అమరావతిని ప్రకటించినప్పటికీ ఇక దాని గుర్తింపు రాష్ట్రంలో నామమాత్రంగానే ఉంటుంది అన్నది చిన్న పిల్లాడిని అడిగినా చెబుతాడు. మరీ ఇలాంటి సమయంలో జగన్ కన్న కల ఏమిటి…? బాబు చెడగొట్టుకున్న నా కథ…? ఏమిటి అసలు ఈ కలల గొడవేమిటి అనేది చూద్దాం…
ఈ ట్వీట్ ఏదో ఇన్సెప్షన్ సినిమాలా ఉందే…
ఏపీ 3 రాజధానులు పై వివాదం రోజు రోజుకీ ముదురుతున్న నేపథ్యంలో టీడీపీ ఎంపీ వేసిన ట్వీట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. “మన కలలు మనమే సాకారం చేసుకోవాలి మన కలలు ఎదుటి వారు సాకారం చేయాలని కోరుకోవడం అవివేకం అమరావతి @ncbn ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం కన్న కల అది సాకారం అవ్వాలంటే 2024 లో @JaiTDP అధికారంలోకి రావాలి ఆ దిశగా పార్టీలో అందరూ పాటుపడాలి మీడియా సమావేశాల వల్ల పేపర్ స్టేట్మెంట్స్ వల్ల ప్రయోజనం లేదు,” అంటూ ఆయన ట్వీట్ చేశారు.
అవును మంత్రి గారూ… అసలు చంద్రబాబు కన్న అమరావతి అనే ఒక కలను ప్రజలు సహకారం చేయాలా…. లేదా బాబు ప్రజల కోసం చేయాలా..? ఈ ఒక్క విషయం క్లారిటీ ఇవ్వండి. లేకపోతే చంద్రబాబు జగన్ తీరుస్తాడని ఏమైనా ఆశలు పెట్టుకున్నాడా…? ఏదో సెంటిమెంటల్ గా ట్వీట్ చేయాలని తప్పించి ఆ విషయం ఎక్కడ ఉంది? అదేదో హాలీవుడ్ చిత్రం ‘ఇన్సెప్షన్’ లో టాప్ హీరో లియోనార్డో డికాప్రియో తన తోటి వారి కలలను సాకారం చేసేందుకు వారు ప్రపంచంలోని కి వెళ్లి అక్కడ విశ్వ ప్రయత్నాలు చేస్తుంటాడు. అలాంటిది ఏమన్నా మన రాజకీయ నాయకులు దగ్గర్నుంచి ఆశిస్తున్నారా ఏంటి కొంపతీసి…?
మరి జగన్ కల విషయానికి వస్తే…
జగన్ కు ఉన్నది ఒకటే కల. తనపై ఉన్న అవినీతి మచ్చలను తుడిచి వేసుకుని దేశంలోనే బెస్ట్ సీఎం గా ఎదగాలని. నిన్ననే నిర్వహించిన ఒక సర్వే నిర్వహించిన పోల్ లో దేశంలోనే బెస్ట్ సీఎం గా మూడో స్థానంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నిలిచారు. ఇంతకుమించి అతని నుంది పెద్ద పెద్ద ఆశలు, ఆశయాలు ఏమీ కనపడవు. కానీ జగన్ ఇదే క్రమంలో క్రమంలో 3 రాజధానుల నిర్ణయం తీసుకున్నారు. మరి అతని కల సాకారం చేయడానికి అమరావతి రైతులు తమ భూములను త్యాగం చేయడం కూడా సమంజసం కాదు. వారికి ఏదో ఒక రకంగా న్యాయం చేయకపోతే జగన్ కోసం ఒక ప్రాంతంలోని ప్రజలను, వారి భవిష్యత్తు తరాల తో పాటు తీవ్ర ఇబ్బందుల్లో పడేసినట్లే. ఈ విషయంలో కూడా జగన్ తన కలను నెరవేర్చుకుని… అవతలి వారికి న్యాయం చేకూరేలా వ్యవహరించాలని విశ్లేషకుల అభిప్రాయం.
వారికి కలలు ఉండవా…. వాళ్ళు మనుషులు కాదా?
ఇక జగన్ చంద్రబాబు వెర్షన్ ల కలల ప్రపంచం అయిపోతే…. అసలైన వెర్షన్ కి వద్దాం. అదే అమరావతి రైతుల వెర్షన్. వాళ్లంటే నాయకులు కలలు కనేందుకు వాటిని సాకారం చేసుకోవడానికి వారికి ఎన్నో అవకాశాలు, దారులు ఉంటాయి. మరి అమరావతి రైతులు విషయం ఏమిటి..? ఒక ముఖ్యమంత్రి వచ్చి మీ బతుకులు ఐదేళ్ళలో మారిపోతాయి అంటే గుడ్డిగా నమ్మి స్థలాలు, పొలాలు ఇచ్చేశారు. మరి ఇంకో ముఖ్యమంత్రి ఇప్పుడు వచ్చి మీ త్యాగానికి మీరు అనుకున్నంత విలువ లేదు అంటే వారు కన్న కలలు పెట్టుకున్న ఆశలు మొత్తం ఏమైపోవాలి అన్నది ప్రశ్న. నాయకుడు అనే వాడు తన పాలనతో ప్రజలకు కలలు కనగలిగే అవకాశాన్ని…. భరోసాని కల్పించి వారి కలలను సాకారం చేసుకోవడం లో తోడ్పడి ముందుండి నడిపించాలే గాని ఇలా తమ అవసరాల కోసం వారిని అన్యాయం చేయడం అనేది ఏమాత్రం సమంజసం కాదు.
ఇక ఇలాంటి సమయంలో ముఖ్యంగా చంద్రబాబు గురించి మనం మాట్లాడుకోవాలి. అమరావతి లాంటి తన అతి పెద్ద కలను బాబు తన ఐదేళ్ల పాలనలో సాకారం చేసుకునే ప్రయత్నం నిజాయితీగా చేసి ఉంటే జగన్ ఇంత సాహసం చేసి ఉండేవాడా? లేదా మూడు రాజధానులు అనే అంశం తెర మీదకు వచ్చి ఉండేదా..? ఏదో ఒక ఇరవై ఏళ్ళకు మన కలలు నెరవేర్చుకుందా…. అప్పటిదాకా ఈ అమరావతిని పట్టుకొని ప్రజలను ఆడుకుందాం అంటే…. కుదిరే పనేనా..? మరి చంద్రబాబు మొదలుపెట్టిన ఈ పొలిటికల్ గేమ్ ఆసాంతం ఆడేంత ఓపిక, పవర్, దమ్ము టీడీపీకి ఉన్నాయా అన్నది వేచి చూడాలి.