దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా సినిమా ఆర్ ఆర్ ఆర్. టాలీవుడ్ స్టార్ హీరోలు ఎన్.టి.ఆర్ ..మెగా పవర్ స్టార్ రాం చరణ్ లు ఈ సినిమాలో నటిస్తున్నారు. ఫిక్షన్ కథాశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎన్.టి.ఆర్ కొమరం భీం గా.. రాం చరణ్ మన్యం వీరుడు అల్లూరి సీతా రామరాజు పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్ సీనియర్ హీరో అజయ్ దేవగన్ బ్రిటన్ మోడల్ ఓలివియా మెరీస్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ సినిమాని పూనే దగ్గర్లో సెట్ వేసి కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించాలని ప్లాన్స్ వేసిన రాజమౌళి కరోనా మహమ్మారికి భయపడి అనుకున్న షెడ్యూల్ ని క్యాన్సిల్ చేశారు. దాదాపు 80 శాతం షూటింగ్ కంప్లీటయిన ఆర్ ఆర్ ఆర్ కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ సెట్ ని నిర్మించి అక్కడే మిగతా భాగాన్ని కంప్లీట్ చేయనున్నారు. అందుకోసం సెట్ సిద్దం అవుతోంది.
ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వకీల్ సాబ్ సినిమాలో నటిస్తున్నాడు. హిందీలో సూపర్ హిట్ అయిన పింక్ సినిమాకి అఫీషియల్ రీమేక్ గా ఈ సినిమాని దిల్ రాజు నిర్మిస్తుండగా బాలీవుడ్ ప్రొడ్యూసర్ బోనీ కపూర్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ క్రిష్ సినిమా సెట్స్ మీదకి వెళ్ళనుంది. కాని కరోనాతో ఇప్పట్లో బయట దేశాలకి వెళ్ళే అవకాశం లేకపోవడంతో స్వయంగా క్రిష్ ఆర్ట్ డైరెక్టర్ తో కూర్చొని సెట్ డిజైన్ చేశారు. ఇప్పుడు ఆ సెట్ ని రామోజీ ఫిల్మ్ సిటీలో నిర్మించనున్నారు. అక్కడే పవన్ కళ్యాణ్ క్రిష్ సినిమా షూటింగ్ జరగబోతుంది.
ఈ రెండు సినిమాలే కాదు ప్రభాస్ రాధా కృష్ణ ల సినిమాని కూడా ఇప్పుడు రామోజీ ఫిల్మ్ సిటీలోనే చిత్రీకరణ జరపబోతున్నారు. లాక్ డౌన్ కి ముందు జార్జియాలో షూటింగ్ చేస్తూ ఉన్నపలంగా ఇండియాకి వచ్చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఇక్కడ అన్నపూర్ణ స్టూడియోలో సెట్ వేసి కొంత టాకీ పార్ట్ ని కంప్లీట్ చేశారు. ఇక మిగిలిన షూటింగ్ మొత్తం రామోజీ ఫిల్మ్ సిటీలోనే జరానున్నారని తాజా సమాచారం. మొత్తానికి కరోనా అందరిని ఫిల్మ్ సిటీకి చేరుస్తోంది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?