Hyderabad : ఈ మధ్యకాలంలో ఎంతో సులభంగా సైబర్ నేరగాళ్లు ప్రజలను బుట్టలో వేసుకుని కొత్త తరహా మోసాలకు తెర తీస్తున్నారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ కి చెందిన ఓ మహిళ వాట్సాప్ మెసేజ్ కు ఓ లింక్ వచ్చింది. మెసేజ్ రావడంతో ఆ మహిళ ఆ మెసేజ్ ఓపెన్ చేసి చదవగా ఎలక్ట్రానిక్స్ సైకిల్ ద్వారా నెలకు వేల సంఖ్యలో ఆదాయం పొందవచ్చునని తెలుసుకుంది. అంతే కాకుండా కేవలం లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే నెల నెల 30 వేల ఆదాయం వస్తుందని ఆ మెసేజ్ లో ఉంది. అంతేకాకుండా ఆ మెసేజ్ తో పాటు లింకును కూడా పంపారు.
ఎక్కువ పెట్టుబడి లేకుండా ప్రతినెల డబ్బు వస్తుందని ఎంతో ఆశ పడిన ఆ మహిళ ఎంతో ఆశ్చర్యపడి తనకు ఒక మంచి అవకాశం వచ్చింది అంటూ ఎగిరి గంతేసింది. ఇంకా ఎటువంటి విషయాలు ఆలోచించకుండా వెంటనే ఆ లింక్ ఓపెన్ చేసి షేర్డ్ బీకే అనే అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుంది. అందులో మరింత క్షుణ్ణంగా సమాచారాన్ని పొందుపరించారు. ఆ అప్లికేషన్ లో మీరు కేవలం ఒక లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే ఆ డబ్బు ద్వారా మేము సైకిళ్ళు కొనుగోలు చేసి అద్దెకు ఇస్తాం. ఈ విధంగా ఎలక్ట్రిక్ సైకిల్ ను అద్దెకు తీసుకోవడానికి ఎంతో మంది ఆసక్తి చూపుతున్నారు. ప్రతిరోజు పది గంటలపాటు ఈ సైకిల్ అద్దెకు ఇవ్వడం ద్వారా రోజుకు ఐదు వేల రూపాయల వరకు అద్దె వస్తుందని తెలియజేశారు.
ఈ విధంగా సైకిల్ ను అద్దెకు ఇవ్వడం వల్ల మిగిలిన ఖర్చులు పోగా ప్రతినెల మీకు 30 వేల వరకు ఆదాయం ఉంటుందని ఆ అప్లికేషన్ లో పొందుపరిచారు. ఎటువంటి కష్టం లేకుండా నెలకు ఇంత ఆదాయం వస్తుంది అంటే ఎవరైతే ఇలాంటి మంచి అవకాశాన్ని వదులుకుంటారు. వెంటనే ఆ మహిళ కూడా అక్కడ కనిపిస్తున్నటువంటి ఫోన్ నెంబర్ కు గూగుల్ పే ద్వారా లక్ష రూపాయలను ట్రాన్స్ఫర్ చేశారు. డబ్బులు చెల్లించాక అవతలి వ్యక్తి నుంచి ఎలాంటి స్పందన లేదు. అదే విధంగా తాను డబ్బులు పంపిన ఫోన్ నెంబర్ కు ఎన్ని సార్లు ప్రయత్నించినా స్విచాఫ్ రావడంతో సదరు మహిళ మోసపోయానని గ్రహించి వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాధితురాలు వాట్సాప్ మెసేజ్, లింక్ వచ్చిన వాటి ఆధారంగా దర్యాప్తును కొనసాగిస్తున్నారు.