Income Tax: 2020-21వ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్ (Income tax returns) డిసెంబర్ 31, 2021 లోపు చెల్లించాలి. ఇది కేవలం డ్యూ డేట్ మాత్రమే. అయితే చివరి తేదీని మార్చి 31, 2022గా ఆదాయపు పన్ను శాఖ నిర్ణయించింది. డ్యూ డేట్ లేదా గడువు తేదీలోగా ఐటీఆర్లను దాఖలు చేయకపోతే ఆలస్యపు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. గడువు తేదీ అనేది డిసెంబర్ 31తో ముగిసింది కాబట్టి ఇక ఆఖరి తేదీ ఒక్కటే మిగిలి ఉంది. అంటే మార్చి 31లోగా ఐటీఆర్లను తప్పనిసరిగా ఫైల్ చేయాలి. కానీ మార్చి 31లోగా ఆదాయపు పన్ను రిటర్న్లు దాఖలు చేయకపోతే సీరియస్ పనిష్మెంట్ ఫేస్ చేయక తప్పదు. ఆ సీరియస్ శిక్షలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
Income Tax: పెనాల్టీలు.. కేసులు.. జైలు శిక్షలు
మార్చి 31, 2022 తేదీ తర్వాత కూడా ఐటీఆర్లను ఫైల్ చేయని పక్షంలో.. టాక్స్ పేయర్లపై ఐటీ డిపార్ట్మెంట్ పెనాల్టీ విధిస్తుంది. ఈ పెనాల్టీ అనేది పన్ను చెల్లింపుదారులు కట్టాల్సిన మొత్తం టాక్స్ లో 50 శాతానికి పైగా ఉంటుంది. అలాగే ఐటీఆర్ ఫైల్ చేయని పన్ను మదింపుదారులపై కేసులు నమోదు చేస్తుంది. ఈ కేసులో కనిష్టంగా మూడేళ్లు.. గరిష్టంగా ఏడేళ్ల వరకు శిక్ష పడే అవకాశం ఉంది.
వడ్డీ రీఫండ్ వదులుకోవాల్సిందే
గడువు తేదీ ముగిసి చివరి తేదీలోగా కూడా పన్ను రిటర్న్స్ దాఖలు (ITR filing) చేయడంలో విఫలమైతే వడ్డీ అనేది రిఫండ్ అవ్వదు. అలాగే ఎవరైతే చెల్లించాల్సిన దానికంటే తక్కువ పన్నును డిపాజిట్ చేశారో వారు వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది.
రూ.5 వేల జరిమానా కట్టాల్సిందే
ఇన్కమ్ టాక్స్ (Income Tax) రూల్స్ ప్రకారం డిసెంబర్ 31లోగా రిటర్నులను దాఖలు చేయని వారు ఇప్పుడు రూ.5 వేల పెనాల్టీతో మార్చి 31, 2022లోగా ఐటీఆర్లను ఫైల్ చేసుకోవచ్చు. రూ.5 లక్షల కంటే తక్కువ ఆదాయం ఉంటే వారు వెయ్యి రూపాయల జరిమానాతో లాస్ట్ తేదీ లోగా పన్ను చెల్లించొచ్చు. రెండున్నర లక్షల కంటే తక్కువ ఆదాయం ఉంటే వారు ఎలాంటి జరిమానా కట్టాల్సిన అవసరం ఉండదు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?