న్యూఢిల్లీ: మీ మొబైల్ ఫోన్ మరీ తక్కువ సేపు మోగుతుందని అనుకుంటున్నారా? కొంత కాలం క్రితం దీనిపై దృష్టి పెట్టిన ట్రాయ్ ఒక నిర్ణయం తీసుకుంది. ఇక ఏ మొబైల్ అయినా గానీ 30 సెకన్ల పాటు రింగ్ అవ్వాల్సిందేనని నిర్ణయించింది. ఈ నిర్ణయం మరో రెండు వారాల్లో అమల్లోకి రానుంది. రిలయన్స్ జియో, భారతీ ఎయిర్ టెల్ కంపెనీల మధ్య వివాదం కారణంగా ఈ సమస్య తలెత్తింది. ఎయిర్ టెల్ వినియోగదారులు వేరే మొబైల్ దేనికి ఫోన్ చేసినా.. అవతలి ఫోన్ 45 సెకండ్లపాటు మోగేది. గతంలో ఎయిర్ టెల్ ఈ రింగ్ టైమ్ ను 25 సెకన్లకు తగ్గించింది. మేం తక్కువ తినలేదు అన్నట్లు జియో కూడా రింగ్ టైమ్ తగ్గించింది. దానితో ట్రాయ్ ఈ అంశంపై దృష్టి పెట్టాల్సి వచ్చింది. మొబైల్ ఫోను రింగ్ టైమ్ 30 సెకన్ల, ల్యాండ్ లైన్ రింగ్ టైమ్ 60 సెకన్లు ఉండాలని నిర్దేశిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. అంతర్జాతీయ టెలి కమ్యూనికేషన్స్ యూనియన్(ఐటియూ) మార్గదర్శకాల ప్రకారం అంతర్జాతీయ కాల్స్ చేసినప్పుడు రింగ్ టైము నిమిషం 30 సెకన్ల నుంచి మూడు నిమిషాల వరకూ ఉండొచ్చు. అయితే, డొమెస్టిక్ కాల్స్ విషయంలో ఎటువంటి మార్గదర్శకాలు లేవు.
previous post
next post