IND v ENG : ఇంగ్లాండ్ తో జరుగుతున్న ఐదు t20i ల సిరీస్ చివరి మ్యాచ్ కు చేరుకుంది. 2-2 తో ఇరు జట్లు సమంగా ఉన్న నేపథ్యంలో చివరి t20i లో గెలిచిన జట్టు ట్రోఫీ కైవసం చేసుకుంటుంది. గత మ్యాచ్లో భారత బౌలర్లు చూపించిన ప్రతిభ కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఆనందాన్ని ఇచ్చింది కానీ ఒక విషయం మాత్రం కలవరపెడుతోంది. ఇంగ్లండ్ బ్యాట్స్మెన్ దూకుడుకు అడ్డుకట్ట వేస్తారు అనుకున్న స్పిన్నర్లు ధారాళంగా పరుగులు ఇచ్చేశారు.
రెండవ ఇన్నింగ్స్ లో మంచు ఎక్కువగా ఉండటమే దీనికి ప్రధాన కారణం అని అంటున్నారు. కాబట్టి చివరి టి20లో భారత్ ఒకే ఒక్క స్పిన్నర్ తో బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి. దీనిని సూచించేలా నటరాజ్ ట్విట్టర్ లో ఈ రోజు తాను ఇండియా జెర్సీ వేసుకున్న ఫోటోలు కూడా పెట్టాడు. ఈ ప్రీమియం పేసర్ చివరి t20i కి జట్టులోకి వస్తాడన్న రిపోర్టులు కూడా వచ్చేసాయి.
కాబట్టి గత మ్యాచ్లో ప్రభావం చూపలేకపోయిన సుందర్ నటరాజన్ జట్టులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. పైగా గత మ్యాచ్లో భారత పేసర్ల వేరియేషన్లను ఆడడంలో ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ ఘోరంగా తడబడి వికెట్లు ఇచ్చారు. నటరాజన్ యార్కర్ స్పెషలిస్ట్, స్లో డెలివరీలను కూడా బాగా వేయగలడు. లెఫ్ట్ ఆర్మ్ పేసర్ కాబట్టి ఇంకో సానుకూలత ఉంటుంది.
అయితే వాషింగ్టన్ సుందర్ లాగా నటరాజన్ ఆల్రౌండర్ కాదు. రాహుల్ చహర్ మెయిన్ స్పిన్నర్ కాబట్టి అతను జట్టులో దాదాపు ఉంటాడు. అయితే నటరాజన్ రావడం వల్ల మిడిలార్డర్ సుందర్ లేక కొద్దిగా బలహీనపడుతుంది. పైగా లెఫ్ట్ హాండర్లు ఉన్న ఇంగ్లాండ్ మిడిలార్డర్ బ్యాట్స్మెన్ కొద్దిగా సులువుగా ఆడగలరు. మొత్తానికి రిస్క్ ఉన్నప్పటికీ కోహ్లీ ఈ దిశగా ఆలోచిస్తున్నాడని విశ్వసనీయ వర్గాల సమాచారం. మరి టాస్ పడితే ఏమవుతుందో చూడాలి.