IND v ENG : భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న టి20 సిరీస్ హోరాహోరీగా సాగింది. ఇంగ్లాండ్ 2-1 తో భారత్ పైన… పై చేయి సాధించినప్పటికీ హోం టీమ్ ని తక్కువగా అంచనా వేయలేం. పైగా సిరీస్ ఆదిలో దెబ్బ తిన్న తర్వాత పుంజుకోవడం ఎలాగో టీం ఇండియా కు బాగా తెలుసు. టాస్ ప్రధాన పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్న జట్టు సగం మ్యాచ్ గెలిచినట్లు అని అందరూ అభిప్రాయ పడుతున్నారు.
ఈ క్రమంలో కోహ్లీ టాస్ ప్రభావం తో సంబంధం లేకుండా మ్యాచ్ గెలిచేందుకు తగిన ప్రణాళికలు రచిస్తున్నాడు. మొత్తానికి ఈ రోజు జరగబోయే మ్యాచ్ కూడా ఎర్రమట్టి ఉన్న పిచ్ పైన జరుగుతుంది అని తెలుస్తోంది. మొన్న ఆడిన పిచ్ కాబట్టి గత మ్యాచ్ తో పోలిస్తే ఈ మ్యాచ్లో బంతి ఇంకా ఎక్కువగా తిరుగుతుంది అని పిచ్ రిపోర్ట్ వచ్చేసింది. ఇండియా జట్టులో ఉన్న ఇద్దరు ప్రధాన స్పిన్నర్లు వాషింగ్టన్ సుందర్, చాహల్ ల పైన ఇప్పుడు భారత్ ఎక్కువగా ఆధారపడాల్సి ఉంది.
వాషింగ్టన్ సుందర్ ఎంతో పరిణతితో అద్భుతంగా బౌలింగ్ వేస్తున్నాడు. మూడు మ్యాచ్లలో కూడా అతని ప్రదర్శన చాలా బాగుంది. ప్రధాన స్పిన్నర్ హోదాలో ఉన్న చాహల్ మాత్రం రాణించాల్సి ఉంది. అతనిని ముందుకు వచ్చి ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ హిట్ చేస్తుంటే జవాబు లేకపోయింది. ఇది కోహ్లీని కలవరపెట్టే అంశం.
కాబట్టి వీరిద్దరూ క్లిక్ అయితే ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ ను ఓడించడం భారత్ కు పైగా కష్టం ఏం కాదు. పైగా గ్రౌండ్ కు ఒక వైపు పెద్ద బౌండరీలు ఉండడంతో వారిని బౌండరీలు కొట్టడం చాలా కష్టమైన విషయం. బంతి ఎక్కువగా టర్న్ అయితే ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ పూర్తిగా తడబపడతారు. ఈరోజు భారత్ గెలిచే అవకాశాలు స్పిన్నర్ల పర్ఫార్మెన్స్ మీద ఆధారపడి ఉంటాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు.