IND vs ENG : భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య రేపు వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. మూడు మ్యాచ్ లు పూణేలోనే డేనైట్ మ్యాచ్ లు గా జరగడం విశేషం. ఈ సిరీస్ కి కూడా స్టేడియం లో జనాలు ఉండరు. ఇక పూణే గ్రౌండు మొదటి నుండి బ్యాట్స్మెన్ లకు పూర్తిగా అనుకూలం. ఇక్కడ భారీ స్కోర్లు నమోదు అవుతుంటాయి.
జట్లు 300లకి పైన అలవోకగా కొడితే అంతే తేలిగ్గా ప్రత్యర్థి జట్లు చేజింగ్ కూడా చేస్తాయి. ఇక రేపటి మ్యాచ్లో టాస్ గెలిచిన జట్టు తీసుకునే ఛేజింగ్ అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. పైగా రాత్రి మంచు ప్రభావం చాలా ఉంటుంది. కాబట్టి స్పిన్నర్లకు ఇది కొద్దిగా ప్రతికూల అంశం అవుతుంది.
ఇక్కడ బౌండరీలు చిన్నవి అవుట్ ఫీల్డ్ కూడా చాలా ఫాస్ట్ గా ఉంటుంది. ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ లు భారత్ తో పోలిస్తే భీకర హిట్టర్లు. వారికి ముగ్గురు ఆల్రౌండర్లు ఉన్నారు. కాబట్టి ఇది వారికి బాగా అనుకూలించే అంశం. అయితే భారత్ మాత్రం ఫేవరెట్గా బరిలోకి దిగుతోంది.
ఇప్పటికే రేపటి ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ అని విరాట్ కోహ్లీ ఎప్పుడో తేల్చి చెప్పేశాడు. అలాగే ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ కు వారి ప్రధాన ప్లేయర్ అయిన మాజీ కెప్టెన్ జో రూట్ ఈ సిరీస్కు అందుబాటులో లేడు. ఇంగ్లాండ్ అవలంబించిన రొటేషన్ పద్ధతి వల్ల అతను జట్టుకి దూరం అయ్యాడు.
ఇక భారత్ కు బుమ్రా, జడేజా కూడా ఉండరు. ఇంగ్లండ్ బ్యాట్స్మెన్ ను భారత స్పిన్నర్లు కట్టడి చేసి… భారత్ ఛేజింగ్ చేస్తే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.