IND vs ENG: ప్రస్తుతం ఇంగ్లాండ్ తో కీలక టెస్ట్ సిరీస్ కు సమాయత్తమవుతున్న కోహ్లీసేన కు అనుకోని ఇబ్బంది వచ్చిపడింది. వికెట్ కీపర్ తో రిషబ్ పంత్ తో పాటు మరొక సహాయక సిబ్బంది కి కరోనా సోకింది. దీంతో జట్టు లో ఉన్న మరొక వికెట్ కీపర్ సాహా కూడా ఐసోలేషన్ కి వెళ్ళవలసి వచ్చింది. ఇప్పుడు భారత జట్టు ఐదు టెస్టుల సిరీస్కు ముందు ప్రాక్టీస్ చేయవలసి ఉంది. పైగా ఇంగ్లండ్లోని ఏదో ఒక కౌంటీ జట్టు తో ప్రాక్టీస్ చేసేందుకు ఎదురుచూస్తుంది
ఇలాంటి సమయంలో ఉన్న ఇద్దరు వికెట్ కీపర్లు క్వారంటైన్ లో ఉన్నప్పుడు ఎవరు వచ్చి ప్రాక్టీస్ సెషన్స్ లో పాల్గొంటారు అనే విషయంపై సందిగ్ధత ఏర్పడింది. ఐదు టెస్టుల సిరీస్ వరకు కూడా పంత్ ఆరోగ్యం ఆందోళన గా మారింది. భారత నుండి ఒక స్పెషలిస్ట్ కీపర్ ను ఇప్పటికిప్పుడు పంపినా కూడా అతను జట్టుతో కలవాలంటే రెండు వారాలపాటు క్వారంటైన్ లో ఉండక తప్పదు.
దీంతో టీమిండియాకు వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ బంపర్ ఆఫర్ ఇచ్చాడు. భారత జట్టు ప్రాక్టీస్ మ్యాచ్ సిద్ధం అవుతున్న దశలో దినేష్ కార్తీక్ భారత్ తరఫున వికెట్ కీపింగ్ బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. తన కీపింగ్ కిట్ కి సంబంధించిన ఫోటోలను కూడా ఇదే సందర్భంగా ట్వీట్ చేశాడు. ఇప్పుడు వికెట్ కీపర్లు అయిన వృద్ధిమాన్ సాహా, రిషబ్ పంత్ ఐసోలేషన్ లో ఉండడంతో వికెట్ కీపింగ్ ఎవరు చేస్తారని విషయం పై ఆందోళన ఏర్పడగా దినేష్ కార్తీక్ భారత్ కి బంపర్ ఆఫర్ ఇచ్చాడు.
ఇక ఆల్రెడీ బ్యాట్స్మెన్ రాహుల్ కు వికెట్ కీపింగ్ సామర్ధ్యం ఉంది. ఇలాంటి సమయంలో ఒక వేళ రాహుల్ తాను సిద్ధంగా లేను అంటే తాను వికెట్ కీపింగ్ గ్లౌజ్ లు వేసుకునేందుకు సిద్ధంగా ఉన్నానని కార్తీక్ ట్వీట్ చేశాడు. దినేష్ కార్తీక్ ప్రస్తుతం వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు. కేఎల్ రాహుల్ వన్డే, టి20 లలో భారత జట్టుకి కీపింగ్ చేశాడు కానీ టెస్ట్ ల్లో ఇప్పటి వరకూ వికెట్ల వెనుక ఆ బాధ్యత చేసింది లేదు. మరి దినేష్ కార్తీక్ ఇచ్చిన బంపర్ ఆఫర్ ను భారత జట్టు అందుకుంటుందో లేదో చూడాలి.