IND vs ENG : భారత్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మొదటి వన్డేలో భారత ఓపెనర్ శిఖర్ ధావన్ సత్తా చాటాడు. సెంచరీకి కేవలం రెండు పరుగుల దూరంలో అవుట్ అయినప్పటికీ భారత్ కు భారీ స్కోరు అందించడంలో కీలక పాత్ర పోషించాడు. 106 బంతుల్లో 11 ఫోర్లు 2 సిక్సర్లు సాయంతో 98 పరుగులు చేశాడు. ఇక అతను కెప్టెన్ విరాట్ కోహ్లీతో కలిసి రెండో వికెట్ గా 100 పరుగులకు పైగా జోడించడం విశేషం.
ఇదే క్రమంలో విరాట్ కోహ్లీ కూడా తన అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఓపెనర్ రోహిత్ శర్మ 28 పరుగులు చేసి స్టోక్స్ బౌలింగులో వెనుదిరిగాడు. ధావన్ వికెట్ కూడా స్టోక్స్ తీయడం గమనార్హం. అలాగే స్టోక్స్…. హార్దిక్ పాండ్యాను కూడా ఒక పరుగుకే పెవిలియన్ చేర్చాడు.
ధావన్, అయ్యర్, వెంటవెంటనే అవుట్ అయిన తర్వాత టీమిండియా చిక్కుల్లో పడినట్లు కనిపించింది. హార్దిక్ పాండ్యా కూడా పెవిలియన్ చేరడంతో భారత్ 300 కి పైగా పరుగులు చేస్తుందని ఎవరూ అనుకోలేదు. అయితే కె ఎల్ రాహుల్ అద్భుతమైన ఆటతీరుతో 62 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. అతనితో పాటు మొదటి వన్డే ఆడుతున్న కృనాల్ పాండ్య కేవలం 31 బంతుల్లోనే 58 పరుగులు చేసి సత్తా చాటాడు.
కృనాల్ పాండ్యా 7 ఫోర్లు 2 సిక్సర్లు బాదడం గమనార్హం. వీరిద్దరి సాయంతో టీమిండియా 50 ఓవర్లు ఓవర్లు ముగిసేసరికి ఐదు 317 పరుగులు చేసింది. చివరి ఐదు ఓవర్లలో భారత్ 67 పరుగులు సాధించింది. నలభై నుండి యాభై ఓవర్ల మధ్య 115 పరుగులు సాధించింది. ఇందులో కృనాల్, రాహుల్ వంద పరుగులు చేయడం గమనార్హం.