IND vs ENG : భారత్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న టి20 సిరీస్ 1-1 తో సమానంగా ఉంది. రెండో టీ20లో అద్భుత ప్రదర్శనతో పుంజుకున్న భారత్ అహ్మదాబాద్లోని నరేంద్రమోడీ స్టేడియంలో సిరీస్ ను సమం చేసింది. మిగిలిన 3 t20 మ్యాచ్ లు కూడా ఈ స్టేడియంలోనే జరగనుండడం విశేషం. ఇక మూడవ t20 లో ఎలాగైనా విజయం సాధించాలని ఇరుజట్లు కసితో బరిలోకి దిగుతున్నాయి. ఇందులో గెలుపొంది సిరీస్లో ముందంజ చేయాలని చూస్తున్నారు.
ఇలాంటి సమయంలోనే ఆతిథ్య భారత జట్టుకు ఒక పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. కరోనా దృష్ట్యా మూడవ టి-20 నుండి ఈ సిరీస్ మొత్తం స్టేడియంలో జనాలు లేకుండానే మ్యాచ్ లు నిర్వహించాలని బిసిసిఐ ఆదేశించింది. మొదటి రెండు t20 లకు భారత అభిమానులు భారీ సంఖ్యలో వచ్చారు. ఇక రెండో టీ20లో భారత్ గెలుపు వారి పాత్ర కూడా ఉంటుంది.
ఎంతైనా ఆతిథ్య జట్టుకు సొంత అభిమానులు ఇచ్చే సపోర్ట్ అవసరం. ఇదే విషయాన్ని కోహ్లీ ముందు మ్యాచ్ లలో కూడా ప్రస్తావించాడు. టెస్ట్ సిరీస్ లో గెలవడానికి భారత అభిమానుల ఇచ్చిన ఉత్తేజం ఎంతో సహాయపడింది అని చెప్పాడు. అలాగే భారత అభిమానులు చేసే గొడవ వల్ల ఇంగ్లాండ్ ప్లేయర్లు కూడా తీవ్రమైన ఒత్తిడికి లోనవుతారు.
కానీ కరోనా మహమ్మారి దృష్ట్యా మిగిలిన టి-20 లు మొత్తం జనాలు లేకుండానే స్టేడియం లో జరగాల్సి వస్తోంది. ఇది భారత్ కు కొద్దిగా ప్రతికూల అంశమే. అయితే ఐపీఎల్ మొత్తం అలాగే టి 20 మ్యాచ్ లు ఆడిన భారత ఆటగాళ్లు దీనికి పెద్దగా ఎఫెక్ట్ కాకపోవచ్చు. కానీ ఎంతైనా అభిమానుల మద్దతు ఉంటే ఆ కిక్కే వేరుగా ఉంటుంది.