IND vs ENG : ఇంగ్లాండ్ తో మరి కొద్ది నిమిషాలలో మొదలుకానున్న ఐదవ టి-20లో భారత జట్టు విరాట్ కోహ్లీ టాస్ ఓడి పోయాడు. గెలిచిన వెంటనే మరో ఆలోచన లేకుండా ఇంగ్లాండ్ కెప్టెన్ మోర్గాన్ చేజింగ్ చేసేందుకు మొగ్గు చూపాడు.
దీంతో భారత్ గెలుపు అవకాశాలు సంక్లిష్టంగా మారాయని భారత అభిమానులు ఆలోచిస్తున్న నేపథ్యంలో కోహ్లీ టీం లోని మార్పులను ప్రకటించి వారిలో ధైర్యాన్ని నింపాడు అనే చెప్పాలి. ఫాంలో లేని కే ఎల్ రాహుల్ ను టీమ్ నుండి తప్పించారు. అతని స్థానంలో రోహిత్ శర్మతో… కోహ్లీ ఓపెనింగ్ చేయనున్నాడు.
ఓపెనింగ్ చేసినప్పుడు కోహ్లీ రికార్డు అత్యద్భుతంగా ఉంది. ఎవరికీ సాధ్యం కాని రీతిలో అతను ఓపెనర్ గా గతంలో చెలరేగిపోయాడు. అయితే కె.ఎల్.రాహుల్ స్థానంలో బ్యాట్స్ మెన్ ను జట్టులోకి తీసుకోకుండా పేస్ బౌలర్ అయిన నటరాజన్ ను తీసుకున్నారు.
దీంతో ఈ రోజు భారత జట్టులో ముగ్గురు ప్రధాన పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతో సహా హార్దిక్ రూపంలో మరొక బౌలింగ్ ఆల్రౌండర్ కూడా ఆడనున్నాడు. ఇక ఆరుగురు బౌలర్లతో లక్ష్యాన్ని నిలువరించడం భారత్ కు మరింత సులభం అవుతుంది. దీంతో భారత్ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.