IND vs ENG : ఇంగ్లాండ్ తో జరిగిన ఐదు మ్యాచ్ ల ట్వంటీ సీరీస్ లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన భారత్ చివరికి ట్రోఫీని కైవసం చేసుకుంది. భారత బ్యాట్స్మెన్ సరైన సమయంలో సత్తా చాటడంతో ప్రపంచ నెంబర్ వన్ జట్టుని ఓడించింది. అయితే భారత బ్యాటింగ్ లైనప్ కి రెండు బలమైన స్తంభాలు అయిన కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఓపెనర్ రోహిత్ శర్మ కూడా ఇదే క్రమంలో తమ ఐసిసి ర్యాంకింగ్స్ మెరుగుపరుచుకున్నారు.
అంతర్జాతీయ ట్వంటీ లో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ టాప్-2 లోకి వచ్చాడు. ఇక కెప్టెన్ విరాట్ కోహ్లీ తొలి స్థానంలో నిలవడం గమనార్హం. విరాట్ కోహ్లీ కంటే ముందు ఇంగ్లాండ్ t20 బ్యాట్స్మెన్ డేవిడ్ మలాన్ మొదటి స్థానంలో ఉండేవాడు. అయితే ఈ సిరీస్లో చివరి మ్యాచ్ మినహాయించి అతడు విఫలం కావడం…. అలాగే కోహ్లీ 3 అర్థ సెంచరీలతో సత్తా చాటడంతో టాప్ పొజిషన్ ను భారత కెప్టెన్ సొంతం చేసుకున్నాడు.
నిన్న రాత్రి జరిగిన చివరి t20 మ్యాచ్లో రోహిత్ శర్మ 34 బంతుల్లో 4 ఫోర్లు 5 సిక్సర్లతో 64 పరుగులు చేశాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా 80 పరుగులు చేయడం గమనార్హం. దీంతో వీరిద్దరూ మొదటి రెండు స్థానాలను ఆక్రమించారు.
ఇక అంతర్జాతీయ t20 లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో కూడా విరాట్ కోహ్లీ 3,103 పరుగులతో కొనసాగుతున్నాడు. అందులో కూడా రెండో స్థానంలో రోహిత్ శర్మ 2,864 పరుగులతో రెండవ స్థానానికి ఎగబాకాడు. రోహిత్ శర్మ 111 టీ20 ల్లో 24 సెంచరీలు 22 అర్థ సెంచరీలతో ఈ ఘనత సాధించాడు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?