IND vs ENG : భారత జట్టు ప్రస్తుతం ఇంగ్లాండ్ తో టీ20 సిరీస్ కోసం తలపడుతున్న విషయం తెలిసిందే. నిన్నటి మ్యాచ్ లో ఓడిపోవడంతో ఇంగ్లాండ్ 2-1 తో భారత్ కన్నా ఈ ఐదు మ్యాచ్ ల సిరీస్ లో ముందంజలో ఉన్న విషయం తెలిసిందే. ఇక రెండు మ్యాచ్ల్లో ఓడిపోవడానికి ప్రధాన కారణం భారత్ బ్యాటింగ్లో పేలవ ప్రదర్శన కనబర్ఛడమే. మొదటి మ్యాచ్లో శ్రేయస్ అయ్యర్…. మూడో మ్యాచ్లో విరాట్ కోహ్లీ జట్టుని అసాధారణ ఆటతీరుతో ఆదుకున్నప్పటికీ వారు చేసిన పరుగులు భీకర ఇంగ్లాండ్ జట్టుకు అసలు సరిపోలేదు.
ఇక సిరీస్ లో జరిగిన మూడు మ్యాచ్ల లో కలిపి కేవలం ఒకే ఒక్క పరుగు చేసిన ఓపెనర్ రాహుల్ పైన భారత అభిమానులు తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయ టి20 ర్యాంకింగ్స్లో రెండో స్థానంలో ఉన్న రాహుల్ తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడం లేదంటూ వారు ఈ కర్ణాటక ఓపెన్ పైన విరుచుకుపడుతున్నారు. అయితే రాహుల్ గతకొద్దికాలంగా టీమిండియాలో అత్యుత్తమ బ్యాట్స్ మెన్ గా వెలుగొందాడు. అతని రికార్డులు, చేసిన పరుగులు అత్యద్భుతంగా ఉన్నాయి.
ఇక ఈ విషయంపై మూడవ మ్యాచ్ అయిపోయిన తర్వాత కోహ్లీ మాట్లాడుతూ, “ఎవరు ఏమి అనుకున్నా… రాహుల్ ఛాంపియన్ ప్లేయర్. ఆ మాటకి వస్తే రెండు మ్యాచ్ల్లో ముందు నేను కూడా అస్సలు ఫాంలో లేను. కేవలం ఆరు నుండి ఎనిమిది బంతుల్లో ఉత్తమ బ్యాట్స్మెన్ ఫామ్ లోకి వచ్చేస్తారు. రాహుల్ కూడా అదే కోవకి చెందిన వాడు. కాబట్టి అతని పై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఒక బౌండరీ సరిగ్గా కొడితే చాలు తర్వాత ఫామ్ దానంతట అదే వస్తుంది. ఇప్పటికీ అతనే మా మొదటి ఛాయిస్ ఓపెనర్” అని కోహ్లీ స్పష్టం చేశాడు.
అయితే భారత్ బెంచ్ కూడా స్ట్రాంగ్ గా ఉంది. టి20 ప్రపంచ కప్ సమీపిస్తున్న నేపథ్యంలో కుర్రాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలని వాదనలు వస్తున్న సమయంలో వాటన్నింటికీ కోహ్లీ ఇలా చెక్ పెట్టడం విశేషం.