IND vs ENG : క్రికెట్ లవర్స్ కు పాండ్యా బ్రదర్స్ పవర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముంబై ఇండియన్స్ జట్టుకి వీరిద్దరూ చాలా ఎన్నో ఏళ్లుగా మిడిల్ ఆర్డర్ లో తమ సేవలను అందిస్తున్నారు. ఆ జట్టుకు వెన్నుముక లా మారిన హార్థిక్ పాండ్యా భారత మిడిల్ ఆర్డర్ లో ఎన్నో ఏళ్ళుగా అదే పనిని కొనసాగిస్తున్నారు. ఇక అన్న కృనాల్ గతంలోనే టీ20ల్లో ఆరంగేట్రం చేశాడు. ఇప్పుడు వన్డే మ్యాచ్ లకు జాతీయ జట్టులో చోటు సంపాదించాడు.
ఈరోజు జరుగుతున్న మొదటి వన్డేలో అద్భుతమైన ఆట తీరుతో 31 బంతులు ఎదుర్కొన్న కృనాల్… 58 పరుగులు చేయడం గమనార్హం. ఇందులో ఏడు ఫోర్లు, రెండు సిక్సర్లు కూడా ఉన్నాయి. ఇలా అద్భుతమైన ఆట తో భారత్ కు భారీ స్కోరు అందించడంలో కృనాల్ పాండ్యా పోషించిన తీరుమి ఎంత మెచ్చుకున్నా తక్కువే. ఒకపక్క రాహుల్ బంతిని టైమింగ్ చేయడానికి తడబడుతున్న దశలో వచ్చిన పాండ్యా ఎలాంటి తడబాటు లేకుండా భారీ షాట్లు మంచి టైమింగ్ తో ఆడి రాహుల్ తర్వాత రెచ్చిపోయేందుకు తగిన సమయం కల్పించాడు.
అయితే మ్యాచ్ మొదలు కాక ముందు తమ్ముడి దగ్గర నుండి టీమిండియా టోపి తీసుకొని అన్న కృనాల్ ఎమోషనల్ అయ్యాడు. ఆకాశం వైపు చూపించి ఈ మధ్యనే కాలం చేసిన అతని తండ్రిని గుర్తుకు తెచ్చుకున్నాడు. అలాగే ఎమోషనల్ గా కనిపించాడు. భారత్ మొదటి ఇన్నింగ్స్ పూర్తయిన తర్వాత murali karthik పోస్ట్ ఇన్నింగ్స్ live chat కు పిలిచాడు. అయితే అక్కడ ఏమి మాట్లాడలేని కృనాల్ గట్టిగా ఏడ్చేశాడు.
తను మాట్లాడలేని కామెంటేటర్ కి సైగ చేశాడు. ఈ సందర్భంలో నాన్న ఉంటే ఎంతో సంతోషించేవాడిని తమ్ముడు హార్థిక్ పాండ్యా ను కౌగిలించుకుని గట్టిగా ఏడ్చేశాడు కృనాల్.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?