IND vs ENG : T20 సిరీస్ లో ఆతిథ్య భారత జట్టుకు గట్టిపోటీ ఇచ్చిన ఇంగ్లాండ్ కీలక సందర్భాల్లో తడబడి సిరీస్ చేజార్చుకుంది. అయినప్పటికీ ఇంగ్లాండ్ నెంబర్ వన్ జట్టుగా వరల్డ్ కప్ ఛాంపియన్ గా ఎప్పుడు ప్రమాదకరమే. వారి జట్టు ఎప్పుడూ సమతూకంగా ఉంటుంది. అలాగే 20 మంది ప్లేయర్లు తుది జట్టులో పోటీ కోసం ఎప్పుడూ ప్రయత్నిస్తుంటారు. అంతటి బలమైన ఇంగ్లాండ్ జట్టు భారత్ తో వన్డే సిరీస్ కోసం తమ 14 సభ్యుల జాబితాను విడుదల చేసింది.
జట్టు : ఇయోన్ మోర్గాన్ (సి), మొయిన్ అలీ, జాసన్ రాయ్, జానీ బెయిర్స్టో, బెన్ స్టోక్స్, సామ్ బిల్లింగ్స్, జాస్ బట్లర్, లియామ్ లివింగ్స్టన్, మాట్ పార్కిన్సన్, ఆదిల్ రషీద్, రీస్ టోప్లీ, మార్క్ వుడ్, టామ్ కరన్, సామ్ కరన్.
భారత్ చాలా బలమైన జట్టు. అదీ కాకుండా సొంత మైదానాల్లో వారు స్పిన్ ఆయుధంగా చెలరేగిపోతారు. వన్డేలో భారత స్పిన్నర్లను ఎదుర్కోవడం ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ కు సవాలే. అయితే ఐపీఎల్ కారణంగా వారికి ఇక్కడ స్పిన్నర్లను ఆడిన అనుభవం మరింత ఎక్కువ ఉంది.
ఇక పోతే ఈ జట్టు నుండి ఇంగ్లాండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ గాయం కారణంగా వైదొలిగాడు. అలాగే ఇంగ్లాండ్ అవలంబిస్తున్న రొటేషన్ పద్ధతి కారణంగా మాజీ కెప్టెన్… ఇంగ్లాండ్ మేటి ప్లేయర్ జో రూట్ కూడా జట్టు దూరంగా ఉన్నాడు. అతనితోపాటు ఆల్రౌండర్ క్రిస్ వోక్స్ కూడా రొటేషన్ పద్ధతి వల్ల జట్టులో స్థానం కోల్పోయాడు.