IND vs ENG : ఇంగ్లాండ్ తో టి20 సిరీస్ చివరి దశకు చేరుకుంది. రేపు జరగబోయే చివరి టి20లో తో సిరీస్ ముగుస్తుంది. ఆ తర్వాత ఈ నెల 23వ తేదీ నుండి వన్డే సిరీస్ ప్రారంభం అవుతుంది. మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో అన్ని మ్యాచ్ లు పూణేలోనే జరుగుతాయి. ఈరోజు ఉదయమే బిసిసిఐ వన్డే జట్టు కి సంబంధించిన సభ్యుల లిస్టును విడుదల చేసింది.
అయితే అనూహ్యంగా టీమ్ ఇండియా జట్టు లో ఇప్పటివరకు జట్టులో లేదా బెంచ్ లో కొనసాగుతూ వస్తున్న ముగ్గురు ప్లేయర్ల పై వేటు పడింది. మొదటిగా కర్ణాటక ఓపెనర్ మయాంక్ అగర్వాల్ ను టీమ్ నుండి తప్పించారు. గత ఏడాది ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్లో పేలవ ప్రదర్శన కనబరిచాడు మయాంక్. ఆ ప్రభావం ఇప్పుడు పడిందనే చెప్పాలి. అయితే వన్డేల్లో మయాన్ కు పెద్దగా అవకాశాలు రాలేదు. వచ్చిన కొద్ది మ్యాచ్లు కూడా బాగానే పర్ఫార్మ్ చేశాడు కానీ ప్రస్తుతం ఉన్న పోటీని తట్టుకోలేక పోయాడు.
ఇలాగే అదృష్టవశాత్తు తన స్థానం కోల్పోయిన ఆటగాడు మనీష్ పాండే. ఎప్పటినుండో దేశవాళి క్రికెట్ ఆడుతూ చాలా ఏళ్ళ ముందు ఇంటర్నేషనల్ ఎంట్రీ ఇచ్చిన పాండే మిడిలార్డర్లో జట్టుకు సేవలు అందిస్తున్నాడు. ఇతను కూడా అవకాశం వచ్చినప్పుడల్లా దానిని రెండు చేతులా అందిపుచ్చుకున్నాడు కానీ గత ఐపీఎల్ లో పేలవ ప్రదర్శన ఇతని స్థానాన్ని దెబ్బతీసింది అనే చెప్పాలి.
వీరితోపాటు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు చెందిన ఫేస్ బౌలర్ నవదీప్ సైనీ పైన కూడా వేటు వేశారు. గత కొద్ది కాలంగా సైనీ నిలకడగా ప్రదర్శన చేయలేకపోతున్నాడు. సైనీ స్థానంలో యువ ఫాస్ట్ బౌలర్ ప్రసిద్ధ కృష్ణ మొట్టమొదటి సారి భారత జట్టు తరఫున ఆడనున్నాడు. అతనితోపాటు నిన్నటి మ్యాచ్ లో చెలరేగిన సూర్య కుమార్ యాదవ్ కు కూడా వన్డే జట్టులో చోటు కల్పించారు. రిషబ్ పంత్ మళ్ళీ తిరిగి తన స్థానాన్ని సొంతం చేసుకున్నాడు.