IND vs ENG : టీ-20 సమరం ముగిసింది. ఇప్పుడు ప్రపంచ మేటి జట్టు అయిన భారత్-ఇంగ్లాండ్ వన్డే టూర్ కి రెడీ అయ్యాయి. రేపు మధ్యాహ్నం ఒకటిన్నర గంటల నుండి మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం మొదలు అవుతుంది. ఇక భారత జట్టు విషయానికి వస్తే పేపర్ పై బలంగా ఉన్న ఆతిథ్య జట్టు ఇంగ్లాండ్ కు గట్టి పోటీ ఇస్తుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు.
ఇక జట్టులో ప్రధాన పేస్ బౌలర్ అయిన జస్ప్రీత్ బుమ్రా, స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా కూడా మిస్ అయ్యాడు. అయినప్పటికీ భారత్ బలమైన జట్టు గానే ఉంది. రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ ఓపెనర్లుగా బరిలోకి దిగుతారని కెప్టెన్ విరాట్ కోహ్లీ వెల్లడించిన విషయం తెలిసిందే.
ఇక రేపు దాదాపుగా భారత్ ఈ 11 మందితోనే ఆడవచ్చు.
భారత్ : రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ (సి), శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ (wk), హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్ కుమార్, శార్దుల్ ఠాకూర్, మహమ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చాహల్.
ఇంగ్లాండ్ జట్టు కూడా అంతే బలంగా ఉంది…!
ఇంగ్లాండ్ : జాసన్ రాయ్, జానీ బెయిర్స్టో, బెన్ స్టోక్స్, ఇయాన్ మోర్గాన్, జాస్ బట్లర్, సామ్ బిల్లింగ్స్, మొయిన్ అలీ, సామ్ కరన్, మార్క్ వుడ్, ఆదిల్ రషీద్, రీస్ టోప్లీ
టాస్ గెలిచిన జట్టు మొదట బౌలింగ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే మొదటి రెండు వన్డేలకు దాదాపుగా మొదటి ఛాయిస్ ప్లేయర్లు పైన చెప్పిన వారే ఉంటారు. ఇక ఇరు జట్లు మొదటి రెండు మ్యాచ్ లు గెలిచి సిరీస్ కైవసం చేసుకొని మూడో మ్యాచ్లో కొత్త వారికి ఇవ్వాలని భావిస్తున్నాయి. ఐపిఎల్ ముందు ఇరు జట్లకు ఇదే చివరి సిరీస్.