IND vs ENG : ఇంగ్లాండ్ జట్టు మొదటి టీ20 లో భారీ విజయం సాధించిన తర్వాత ఆ ఆనందం వారికి కొద్దిసేపు కూడా నిలవలేదు. రెండో టీ20లో భారత్ కూడా వారిని ఎంతో చిత్తుచిత్తుగా ఓడించింది. భారత్ 164 పరుగులు లక్షాన్ని ఛేధిస్తున్నప్పుడు ఎక్కడా కూడా తడబడినట్లు కనిపించలేదు. ఇది ఇంగ్లాండ్ ఆత్మస్థైర్యాన్ని ఖచ్చితంగా దెబ్బతీసే విషయమే పైగా. మొదటి మ్యాచ్ ఏకపక్షంగా ఓడిన తర్వాత భారత్ పుంజుకున్న తీరు కూడా వారిలో గుబులు రేపే అంశమే.
అయితే ఇంగ్లాండ్ ను అంత తక్కువగా అంచనా వేయలేం. హార్డ్ హిట్టర్స్, క్వాలిటీ బౌలర్లు, అవసరానికి సత్తా చాటే ఆల్రౌండర్లు వారి సొంతం. ఇక మూడవ టీ20కి కూడా అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియమే ఆతిథ్యం ఇవ్వనుంది. అయితే ఈసారి మాత్రం మొదటి రెండు మ్యాచ్ లు ఆడిన పిచ్ కాకుండా కొత్త పిచ్ పైన 3 వ టీ20 జరగనుంది. ఆ పిచ్ పైన ఎర్రమట్టి ఎక్కువగా ఉంటుందని నిన్నటి మ్యాచ్ అయిపోయిన తర్వాత ఇంగ్లాండ్ కెప్టెన్ మోర్గాన్ చెప్పడం జరిగింది.
కాబట్టి ఈ పిచ్ స్పిన్ కి బాగా అనుకూలిస్తుంది, ఇంగ్లాండ్ జట్టు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని వారి స్పిన్ ఆల్ రౌండర్ మొయిన్ అలీ ని బరిలోకి దించే అవకాశాలు ఉన్నాయి. భీకర హిట్టరే అంతేకాకుండా అలీ క్వాలిటీ ఆఫ్ స్పిన్నర్ కూడా. భారత జట్టులో రిషబ్ పంత్, ఇషాన్ కిషన్ ల రూపంలో ఇద్దరు ఎవరు లెఫ్ట్ హ్యాండర్లు ఉన్నారు. వారిద్దరు నిన్నటి మ్యాచ్ లో కూడా చెలరేగి ఆడారు.
ఇక వారికి అలీ లాంటి ఆఫ్ స్పిన్నర్ ను ఎదుర్కోవడం కష్టంగా ఉంటుంది. కాబట్టి అతను ఆడే అవకాశాలు ఉన్నాయి. ఇక అంతే కాకుండా మార్క్ వుడ్ కూడా గాయం నుండి కోరుకున్నట్లు టీమ్ వర్గాల నుండి సమాచారం. అతను కూడా తిరిగి జట్టులోకి వచ్చే అవకాశం ఉంది .కాబట్టి ఇంగ్లాండ్ కు వీరిద్దరూ రేపు టీ-20 లో టీమ్ లో ఆడితే వారికి గెలుపు అవకాశాలు మరింత మెరుగ్గా ఉంటాయి.