IND vs ENG : భీకరమైన ఇంగ్లాండ్ జట్టుతో టీమిండియా టి20 సిరీస్ ఆడుతోంది. మొదటి టీ20 లో అదృష్టం కూడా ఇంగ్లాండ్ వైపే మొగ్గు చూపింది. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. అయితే టీమిండియా ఈసారి మోర్గాన్ సేన ను కట్టడి చేసేందుకు సరికొత్త వ్యూహాలతో బరిలోకి దిగింది.
మామూలుగా ఇంగ్లాండ్ బ్యాటింగ్ లైనప్ మొత్తం హిట్టర్ల తో నిండి ఉంటుంది. వారి టీం లో ఎలాంటి బౌలింగ్ దళాన్ని అయినా కకావికలు చేసే సత్తా ఉన్న బ్యాట్స్మెన్ ఉన్నారు. అదీ కాకుండా ఇండియా బౌలింగ్ చేసేటప్పుడు మంచు ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి టీం ఇండియా కి బలమైన స్పిన్నర్లకు ఇది ప్రతికూల అంశం. అయితే ఇండియా తెలివిగా ఒక బ్యాట్స్మెన్ ను త్యాగం చేసి అక్షర్ పటేల్ ను జట్టు లోకి తీసుకుంది.
అక్షర్ పటేల్ ఆల్రౌండర్ అయినప్పటికీ అతని బౌలింగ్ పైనే ఎక్కువగా టీమ్ ఇప్పుడు ఆధారపడుతోంది. టెస్ట్ సిరీస్లో అత్యద్భుత ప్రదర్శన కనబరిచిన పటేల్ ను ఆడేందుకు ఇంగ్లండ్ ఆటగాళ్లు తడబడ్డారు. అంతే కాకుండా వారిలో చాలామంది ఇప్పటివరకు అక్షర్ ను ఎదుర్కోలేదు.
అతనితోపాటు హార్దిక్ పాండ్యా కూడా ఈ సిరీస్లో బౌలింగ్ వేస్తున్నట్లు ఇప్పుడే చెప్పాడు. అతని మీడియం పేస్ బౌలింగ్ కూడా ఇప్పుడు భారత్ కు కలిసొచ్చే అంశం. ఇండియా బ్యాట్స్మెన్ ఎప్పుడూ పోటీకి సిద్ధంగా ఉంటారు. బౌలింగ్లో వీరిద్దరూ ఈ రోజు క్లిక్ అయితే మ్యాచ్ భారత్ సొంతమే.