IND vs ENG : మొదటి వన్డేలో భారత జట్టు అద్భుతమైన ఆటతీరుతో పుంజుకున్న విషయం తెలిసిందే. ఇంగ్లాండ్ దాదాపు మ్యాచ్ ను చేతుల నుండి లాగేసుకుంటున్న సమయంలో బౌలర్లు అసాధారణ ప్రతిభ కనబరిచి ఇంగ్లాండ్ జట్టు వెన్ను విరిచారు.
అయితే రెండో వన్డేలో మాత్రం ఇంగ్లాండ్ మరింత పక్కా ప్రణాళికతో బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి. వారు ప్రపంచంలోనే నెంబర్ వన్ జట్టు. ఎంతో ప్రతిభ కల ఆల్ రౌండర్ లు, భారీ హిట్లర్ లు, తెలివైన బంతులు వేసే పేస్ బౌలర్లు వారి సొంతం. ఇక ఇంగ్లాండ్ వచ్చే మ్యాచ్ లో రెండు మార్పులతో బరిలోకి దిగవచ్చు అని అనుకుంటున్నారు.
నిన్నటి మ్యాచ్ లో కొత్త ప్లేయర్లు అయిన ప్రసిద్ధ్ కృష్ణ, కృనాల్ పాండ్య ఇంగ్లాండ్ జట్టు విజయావకాశాలను ఘోరంగా దెబ్బ తీశారు. భారత జట్టులో వీరిద్దరి ఆటతీరు మినహాయించి మిగిలిన వారి గురించి ఇంగ్లాండ్ వారికి తెలుసు. ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్ ను సెకండ్ స్పెల్ లో వారు అంచనా వేయలేదు. ఐపీఎల్లో కృనాల్ కి కూడా ఇంగ్లాండ్ వారు బౌలింగ్ ఎవరూ వేయకపోవడం గమనార్హం.
అలాగే ప్రసిద్ధి కృష్ణ ను కెప్టెన్ మోర్గాన్ మినహాయించి ఎవరూ కూడా అంతా ఆడలేదు. మహా అంటే బట్లర్ ఒక రెండు ఓవర్లు ఆడి ఉంటాడు. ఇలా కొత్తవారు వచ్చి మొన్న గేమ్ మార్చేశారు. ఇంగ్లాండ్ కూడా రేపటి మ్యాచ్ లో లివింగ్స్టన్ ని బరిలోకి దించే అవకాశాలు ఉన్నాయి. రాజస్థాన్ రాయల్స్ లో ఆడిన లివింగ్స్టన్ భీకర హిట్టర్. అతనితో పాటు కొత్త పేసర్ రీస్ టాప్లీ కూడా మ్యాచ్ లోకి వచ్చే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. ఇక వీరిద్దరు వచ్చి మొన్న భారత ఆరంగేట్ర ఆటగాళ్ళు చేసిన పనిని వీరూ చేస్తారన్న నమ్మకంతో ఇంగ్లాండ్ ఉంది.