IND vs ENG : భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య రెండో వన్డే రేపు మొదలు కానుంది. టీమిండియా మిడిలార్డర్ బ్యాట్స్మెన్ శ్రేయస్ అయ్యర్ గాయం కారణంగా ఇంగ్లాండ్ తో వన్డే సిరీస్ మొత్తానికి దూరం అయిన విషయం తెలిసిందే. అలాగే అతను ఐపీఎల్ మొత్తానికి దూరం అయ్యాడు అని వార్తలు వస్తున్నాయి. ఇది భారత జట్టుకు గట్టి దెబ్బ అని చెప్పాలి.
అయినప్పటికీ అయ్యర్ స్థానంలో ప్రత్యామ్నాయ ఆటగాళ్ళు ముగ్గురు ఉన్నారు. కానీ వారిలో ఇద్దరికీ జట్టులో చోటు లభించే అవకాశం ఉంది. వారే డాషింగ్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్ మెన్ రిషబ్ పంత్. అలాగే మొన్న టీ20 సిరీస్ లో రెచ్చిపోయిన సూర్య కుమార్ యాదవ్. సుర్య యాదవ్ కి ఇది తొలి వన్డే సిరీస్. మొన్న జరిగిన 20 సిరీస్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన సూర్యకుమార్ యాదవ్ వచ్చీరాగానే అందరి దృష్టిలో పడ్డాడు.
తన అద్భుతమైన హిట్టింగ్ ప్రతిభతో టీంలో చోటు పదిలం చేసుకునే దిశగా వెళ్తున్నాడు. ఇక పంత్ విషయానికి వస్తే…. గత కొద్ది నెలలుగా అసమాన ఆటతీరుతో భారత జట్టుకు చిరస్మరణీయ విజయాలు అందించాడు. ఇక వీరిద్దరి లో ఎవరిని రేపు స్థానంలో తుది జట్టులోకి ఆడించాలి అని భారత్ సతమతమవుతోంది. రేపు కీలకమైన మ్యాచ్ కాబట్టి… అది గెలిస్తే సిరీస్ చేతికి వస్తుంది కాబట్టి భారత్ కు ఈ నిర్ణయం చాలా కీలకమైనది.
అయితే కొన్ని మీడియా వర్గాల ప్రకారం రేపు సూర్యకుమార్ యాదవ్ తన తొలి వన్డే ఇంటర్నేషనల్ ఆడవచ్చు అని చెబుతున్నాయి. దాదాపుగా యాదవ్ ఆడే అవకాశాలే ఎక్కువగా ఉన్నప్పటికీ ఇంగ్లాండ్ మొన్న భారత మిద్ల్ ఆర్డర్ ని దెబ్బతీసిన విధానం చూసి మధ్యలో ఒక లెఫ్ట్ హ్యాండర్ ఉంటే బాగుంటుందని భావిస్తే పంత్ ఆడవచ్చు. మరి వీరిద్దరిలో ఎవరు అయితే బెటర్ అని మీరు అనుకుంటున్నారు?