IND vs SL: భారత క్రికెట్ జట్టు ప్రపంచ క్రికెట్ లో ఒక శక్తిగా అవతరించిన విషయం తెలిసిందే. గత కొన్ని ఏళ్లుగా భారత క్రికెట్ ప్రపంచాన్ని శాసిస్తూ వచ్చింది. మేజర్ ట్రోఫీలు లేవు అన్న సంగతి పక్కన పెడితే భారత క్రికెట్ లో ఉన్నంత టాలెంట్, లోతు అలాగే వారు ప్రదర్శిస్తున్న అసమాన ఆటతీరు ఈ మధ్యకాలంలో ఏ జట్టుకీ సాధ్యం కాలేదు. అన్ని ఫార్మాట్లలో భారత తిరుగులేకుండా రాణిస్తుంటే… కొంతమంది మాజీ ప్లేయర్లు మాత్రం మన జట్టుపై ఏడుస్తూ ఉన్నారు.
తాజాగా భారత్… శ్రీలంక తో జరగబోయే టీ-ట్వంటీ మరియు వన్డే సిరీస్ లకు ఒక జట్టుని పంపిన విషయం తెలిసిందే. అయితే కోహ్లీసేన ఇంగ్లండ్ తో ఇదే సమయంలో టెస్ట్ సిరీస్ ఆడవలసి ఉండగా భారత్ ఇంకొక జట్టుని శ్రీలంక కు పంపింది. దానిని శ్రీలంక మాజీ క్రికెటర్ అర్జున్ రణతుంగ భారత్ తమతో పోటీ పడేందుకు బి గ్రేడ్ పంపడం ఏ మాత్రం సబబుగా లేదు అని వ్యాఖ్యానించాడు.
భారత్తో టి20, వన్డే సిరీస్లు చూడాల్సిన అవసరం లేదని శ్రీలంక క్రికెట్ అభిమానులకు పిలుపునిచ్చాడు. శ్రీలంక క్రికెట్ బోర్డు అతని వ్యాఖ్యలను ఖండించింది. శిఖర్ ధావన్, భువనేశ్వర్ కుమార్, హార్దిక్ పాండ్యా వంటి రెగ్యులర్ జాతీయ జట్టు సభ్యులు ఉన్న జట్టు… బి-గ్రేడ్ జట్టు ఎలా అవుతుంది అని ప్రశ్నించింది. అయితే అర్జున రణతుంగ మాత్రం శ్రీలంక బాగా బలహీన పడిన జట్టు కాబట్టి వారితో తలపడేందుకు ఇటువంటి చిన్న టీం భారతదేశం నుండి పంపించిందని వ్యాఖ్యానించారు.
శ్రీలంక క్రికెట్ బోర్డు లో జరుగుతున్న అవినీతి, అసమానతలు వల్ల జట్టు పరిస్థితి ఇలా తయారైంది అని అన్నాడు. రణతుంగ అన్నట్లు శ్రీలంక క్రికెట్ బోర్డు లో ఎన్నో సమస్యలు ఉన్నాయి కానీ ఇక్కడ భారత్ తప్పుపట్టాల్సిన అవసరం లేదని చెప్పాలి.