అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పర్యటన విజయవంతంగా కొనసాగుతుంది. రెండు రోజుల పర్యటనలో భాగంగా సోమవారం మొతేరా స్టేడియం ప్రారంభించి ప్రసంగించిన ట్రంప్, తరువాత తాజ్ ని సందర్శించారు. నేడు ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందాలపై సంతకాలు చేసారు. మంగళవారం ఇరు దేశాల కీలక ప్రతినిధుల మధ్య ట్రంప్, మోడీలు ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ సందర్భంగా కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నారు.
* రక్షణ రంగంలో మూడు బిలియన్ డాలర్ల ఒప్పందం. భారత్ కు అత్యాధునిక సైనిక పరికరాలు, హెలికాఫ్టర్లు సరఫరాకు ఒప్పందం.
* ఇంధన రంగంలో పరస్పరం సహకారానికి ఒప్పందం. ఇండియన్ ఆయిల్, ఎక్సాన్ మొబిల్ మధ్య అవగాహనా ఒప్పందం.
* ఉగ్రవాదంపై ఉమ్మడిగా పోరాడాలని ఒప్పందం.
* నాణ్యమైన మందుల సరఫరా, ఇరు దేశాల్లో వైద్యపరమైన సాహారకానికి ఒప్పందం.
* ఇరు దేశాల మధ్య భారీ స్థాయిలో వాణిజ్య ఒప్పందం జరిగేలా ప్రతినిధులు, నిపుణులు చర్చించాలని… తదుపరి చర్చల్లో ఆమోదిద్దామని నిర్ణయం.
next post
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?