చైనాతో సరిహద్దు ఉద్రిక్తతల అనంతరం భారత్ తన వైఖరి మార్చుకుంటోంది. గాల్వన్ లోయలో సైనికులను కోల్పోవడం.. వాస్తవాధీన రేఖ ఉల్లంఘనలు.. చర్చలకు చర్యలకు చైనా ప్రవర్తన పోలిక లేకపోవడందో చైనాకు గట్టి జవాబివ్వాలని భావిస్తోంది. ఇందుకోసం ఓ కీలక చర్యకు సిద్దమవుతోంది. అండమాన్ నికోబార్ దీవుల్లో యుద్ధ నౌకలతో భారీ విన్యాసం నిర్వహించి తన సత్తా చాటాలని భారత్ భావిస్తోంది. భారత్ కు అందివచ్చిన అవకాశంగా అమెరికా కూడా ముందుకు వచ్చింది. దీంతో ఈ రెండు దేశాలు తన నావికా విన్యాసాలతో చైనాకు గట్టి హెచ్చరిక చేయాలని భావిస్తున్నాయి.
అమెరికాకు యుద్ధనౌక యూఎస్ఎస్ నిమిట్జ్ ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన యుద్ధనౌకల్లో ఒకటి. త్వరలో ఈ యుద్ధనౌక భారత్ జలాల్లోకి రాబోతోంది. దీనికి యూఎస్ఎస్ రోనాల్డ్ రీగన్ యుద్ధనౌక కూడా రానుంది. దక్షిణ చైనా సముద్రంపై అధిపత్యం తమదే అని వాదిస్తున్న చైనాకు ఇరుదేశాలు కలిసి గట్టి సమాధానం చెప్పాలని భావిస్తున్నాయి. గాల్వన్ లోయ ఉదంతంతో భారత్, కరోనా నేపథ్యంలో అమెరికా చైనాపై రగిలిపోతున్నాయి. ఇప్పటికే వ్యాపార సంభంధాలపై చైనాకు భారత్ ఝలక్ ఇచ్చింది. అమెరికా కూడా చైనా యాప్ప్, సంస్థలపై చర్యలు తీసుకునేందుకు సిధమవుతోంది.
ఈ నేపథ్యంలోనే ఇరు దేశాలు అండమాన్ దీవుల్లో నౌకా విన్యాసాలు చేయాలని భావిస్తున్నాయి. ‘పాసెక్స్’ (పాసింగ్ ఎక్సర్ సైజ్) పేరుతో ఈ విన్యాసాలు జరుపనున్నాయి. భారత్ తరపున ఐఎన్ఎస్ రానా, ఐఎన్ఎస్ సహ్యాద్రి, ఐఎన్ఎస్ శివాలిక్, ఐఎన్ఎస్ కమోర్తా ఈ విన్యాసాల్లో పాల్గొననున్నాయి.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?