ఇండో-చైనా వార్ తర్వాత రెండు దేశాలు స్నేహన్నే కొనసాగించాయి. కానీ.. ఇటివల గాల్వన్ లోయ పరిస్థితులతో వైరం మొదలైంది. ఎవరి వ్యూహాలతో వారు ఎత్తుకు పైఎత్తులు వేసుకుంటున్నారు. ఇండియన్ గవర్నమెంట్ ఏకంగా చైనాకు చెందిన 59 యాప్స్ బ్యాన్ చేసి దెబ్బ కొట్టింది. దీంతో చైనా కంపెనీలకు లక్ష కోట్ల ఆదాయం వరకూ గండి పడింది. ఇప్పుడు ఇండియాలో పెట్టుబడులు పెట్టిన పలు చైనా కంపెనీలపై దృష్టి సారించింది. చైనా ఆర్మీతో వారికి సంబంధాలున్నట్టు వచ్చిన ఆధారాలతో ముందుకు వెళ్తోంది భారత్.
ఎకనమిక్స్ టైమ్స్ కథనం ప్రకారం ఈ లిస్టులో ఈ-కామర్స్ దిగ్గజం ఆలీబాబా గ్రూప్ ఉంది. వీటితోపాటు టెన్సెన్ట్, హ్యువాయ్, క్సింక్సిన్ క్యాధయో ఇంటర్నేషనల్ గ్రూప్, క్సిండియా స్టీల్స్, చైనా ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ గ్రూప్ కార్పొరేషన్ వంటి పలు చైనా కంపెనీలు ఉన్నట్టు పేర్కొంది. ఇవన్నీ భారత్ లో పెట్టుబడులు పెట్టినట్టు కూడా పేర్కొంది. దీంతో వీటన్నింటిపై ఎటువంటి చర్యలు తీసుకోవాలో నిపుణుల సలహాలు తీసుకుంటోంది. ఆలీబాబా గ్రూప్.. ఇండియాలో స్నాప్ డీల్, జోమాటో, పేటీఎం, బిగ్ బాస్కెట్, బైజుస్, ఓలా.. వంటి సంస్థల్లో అమెజాన్ భారీ పెట్టుబడులు పెట్టింది. దీంతో వీటిపై ఎలా చర్యలు తీసుకోవాలో అని భారత్ ఆలోచిస్తోంది.
మొదటగా చైనా కంపెనీలు ఆ దేశ ఆర్మీతో సంబంధాలు కలిగి ఉందని గ్రహించింది అమెరికా. దీంతో భారత్ కూడా వీటిపై చర్యలకు సిద్ధమవుతోంది. ఎప్పుడు.. ఎలా అనేదానిపై చర్చల దశల్లో ఉంది. ఇప్పటికే అమెరికా కూడా చైనాపై ఆగ్రహంగా ఉన్న సంగతి తెలిసిందే.